Virat Kohli: ఇండియన్ క్రికెట్ టీమ్ లో అత్యుత్తమ ఆటగాడిగా విరాట్ కోహ్లీ చెలరేగిపోతున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ గా ఇటీవల చేదు అనుభవాలు ఎదురైనా గాని.. బ్యాట్స్ మ్యాన్ గా .. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఉన్నాడు. కోహ్లీ క్రిజ్ లో ఉన్నాడంటే అపోజిషన్ బౌలర్ కి వణుకు గ్యారెంటీ. ఏమాత్రం ఇతర జట్లుకి చెందినవారు విమర్శించిన… బ్యాట్ తో .. ఇంకెప్పుడూ విమర్శించకుండా రెచ్చగొట్టకుండా… తగిన బుద్ధి చెబుతాడు. ఇండియన్ టీం లో బ్యాట్స్మెన్ గా… అతి తక్కువ టైమ్ లోనే ఎన్నో రికార్డులు కోహ్లీ అధికమించడం జరిగింది. కోహ్లీ ఆటతీరు ఒకానొక సమయంలో సచిన్ టెండూల్కర్… తన రికార్డులను భవిష్యత్తులో బ్రేక్ చేసే విషయంలో కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు అని మీడియా ముందు ఒకానొక సమయంలో తెలిపాడు.
ఇప్పుడు ఇదే రీతిలో కోహ్లీ ఇండియా టీమ్ లో వరల్డ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. విషయంలోకి వెళితే తాజాగా అహ్మదాబాద్లో వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో రెండో బౌండరీ కొట్టిన వెంటనే విరాట్ కోహ్లీ సొంతగడ్డపై అత్యంత వేగంగా 5000 పరుగులు చేసిన ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీ కేవలం 96 ఇన్నింగ్స్ల్లోనే సొంతగడ్డపై 5000 వన్డే పరుగులు పూర్తి చేశాడు. 121 ఇన్నింగ్స్లు ఆడి 5000 పరుగులు చేసిన సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.
అదే సమయంలో, జాక్వెస్ కలిక్ 130, రికీ పాంటింగ్ 138 ఇన్నింగ్స్లు ఆడారు. సొంతగడ్డపై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ లిస్టు లో మొదటి వరుసలో సచిన్ టెండుల్కర్ వుండగా తర్వాత విరాట్ కోహ్లీ తాజాగా రాణించాడు. కానీ సచిన్ కంటే అతి తక్కువ ఇన్నింగ్స్ లో 5 వేల పరుగులు సొంతగడ్డపై విరాట్ కోహ్లీ సాధించటం ఇండియన్ క్రికెట్..వరల్డ్ క్రికెట్ హిస్టరీలో సరికొత్త అధ్యాయంగా మారింది.