Cyberabad Police: సామాజిక పరిస్థితులు, సైబర్ నేరాలు పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు.. అందరికీ అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా, అవగాహన కల్పించడం వీరి ప్రత్యేకత.. యువతకు అర్థమయ్యేలా సినిమాలోని కొన్ని సన్నివేశాలుతో మీమ్స్ తో చెప్పడం వీరి స్పెషాలిటీ.. వీరు అవగాహన కల్పించేందుకు బ్రహ్మానందంతో రూపొందించిన మీమ్స్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి.. ఇటీవల మహేష్ బాబు ఫోటోతో చేసిన మీమ్స్ నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది.. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫోటోతో చేసిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
సైబరాబాద్ పోలీసులు ఈ సారి సైబర్ నేరాల లో భాగమైన QR code ఫ్రాడ్ గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ మీమ్స్ ను రూపొందించారు.. ఇందుకోసం సరైనోడు సినిమా నుంచి ఒక సన్నివేశాన్ని తీసుకొని దాన్ని మీమ్స్ గా చేశారు.. “ఎవరైనా వ్యక్తి పంపే క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే డబ్బులు క్రెడిట్ అవుతాయా లేదా డెబిట్ అవుతాయా..!? QR code స్కాన్ చేసి UPI PIN ఎంటర్ చేస్తే మన ఎకౌంటు నుండి మాత్రమే డబ్బులు డెబిట్ అవుతాయి.. క్రెడిట్ అవ్వవు..” అంటూ అల్లు అర్జున్ ఫోటో తో చేసిన మీమ్స్ ప్రజలకు అర్థమయ్యేలా ఉంది. ఎవరైనా మనకు QR code పంపితే దానిని మనం స్కాన్ చేసి UPI PIN ఎంటర్ చేస్తే మన ఎకౌంటు నుండి డబ్బులు వారికి వెళతాయి అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు సైబరాబాద్ పోలీసులు.. ఈ మీమ్స్ చూసిన నెటిజన్లు మరోసారి బన్నీని వాడేసుకున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరికొంత మంది నెటిజన్లు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడానికి సైబరాబాద్ పోలీసులు ముందుంటారు అంటూ లైక్స్, ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. మొత్తానికి అల్లు అర్జున్ తో Beware of QRcode fraud గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పింది చేశారు సైబరాబాద్ పోలీసులు..
Be Aware the #qrcode fraud https://t.co/KYB3anQ7Ci
— Cyberabad Police (@cyberabadpolice) May 25, 2021