Job Alert: మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో పరిస్థితులు మొత్తం తలకిందులైన సంగతి తెలిసిందే. వైరస్ కారణంగా పెద్ద పెద్ద కంపెనీలు తమ ఉద్యోగస్తులను ఇంటికి పంపించేసి అక్కడి నుండే వర్క్ చేయాలని ఆదేశాలు ఇస్తున్నాయి. ఇదే తరుణంలో ప్రభుత్వాలు కూడా ఇదే తరహాలో వ్యవహరిస్తున్నాయి. మరోపక్క ఉద్యోగస్తులు కంపెనీకి రాక పోని పరిస్థితి నెలకొనడంతో చాలా కంపెనీలు మూతపడుతున్న నేపథ్యంలో ఇంటిలో నుండి జాబ్ చేసుకునే అవకాశాలు ఆన్ లైన్ లో.. ఎక్కువైపోయాయి.
వైరస్ కారణంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల కంపెనీలు మూత పడటంతో పాటు ప్రజలు ఇల్లు దాటి బయటకు రాని పరిస్థితి ఉండటంతో కొన్ని తెలివైన కంపెనీలు.. ఇంటర్నెట్లో ఉద్యోగాలు కల్పిస్తూ.. అవకాశాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ఇంటినుండే పర్మినెంటు ఉద్యోగం చేసుకోవడానికి ఇండియా మర్ట్ అనే సంస్థ ఫ్రీ లన్సర్ కింద ఉద్యోగం కల్పిస్తూ .. ఎటువంటి సేల్స్ చేయాల్సిన అవసరం లేదు అదే రీతిలో ఒత్తిడి కూడా ఉండదు.
డేటా ఎంట్రీ జాబ్ మాదిరిగా సోమవారం నుండి శనివారం వరకు.. 10 గంటలనుండి రాత్రి 7 గంటలవరకు మధ్యలో 4 గంటలు ఎప్పుడైనా వర్క్ చేసుకోవచ్చు.. ప్రతివారం శాలరీ పే చేస్తారు. నౌకరి లో టెలి అసోసియేట్ ఇండియన్ మార్ట్ ద్వారా ఈ ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.. ఇంటి దగ్గర నుండి మంచి జీతం సంపాదించవచ్చు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు రోజుకి వేళల్లో నమోదు కావడంతో.. ప్రభుత్వాలు లాక్ డౌన్ విధిస్తూ ఉండటంతో.. బయట కంపెనీలు మూతపడుతున్న టంతో ఇంటి దగ్గర ఉండి సంపాదించుకునే వారికి ఇది సరైన అవకాశం. కొద్దిపాటి మినిమం డేటా ఎంట్రీ జ్ఞానం అంటే చాలు.. దీనికి అప్లై చేసుకోవచ్చు.