బిగ్ బాస్ షో లో ప్రతి సీజన్ కు టీవీ9 కి సంబంధించిన ఎవరో ఒకరు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అలాగే ఈసారి కూడా దేవి నాగవల్లి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా లోనికి వచ్చింది కానీ దురదృష్టవశాత్తూ ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఇది చాలా మందికి పెద్ద షాక్ అనే చెప్పాలి. అలా బయటకు వచ్చిన దేవి నాగవల్లి తన నిజ జీవితానికి సంబంధించి అనేక విషయాలను చెప్పుకుంటోంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన విడాకుల గురించి ప్రస్తావించింది. అలాగే నమ్మశక్యం కాని రీతిలో తన జీవితం ఎలా ఉంటుంది అంటూ చక్కగా వివరించింది. దేవి నాగవల్లి మాట్లాడుతూ అందరూ అనుకున్నట్లు ఆమెది ప్రేమ వివాహం కాదని.. పెద్దలు కుదిర్చిన పెళ్లి అని చెప్పింది. తర్వాత అమెరికా వెళ్ళవలసి వచ్చింది అని అయితే తనకు అక్కడికి వెళ్లడం ఇష్టం లేదని తెలియజేసింది. అక్కడ ఎందుకో తనకు నటిస్తూ జీవిస్తున్నట్లు అనిపించి మనసుకు కష్టంగా ఉందని అందుకే తాను ఎవరికీ కనెక్ట్ కాలేదు అని చెప్పింది.
ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి మంచివాడు కాదు అని తాను చెప్పడం లేదని…. కానీ అతనితో కలిసి అమెరికాలో తను ఉండలేక పోయాను అని…. ఇంట్లోనే ఉంటూ ఒంటరిగా గడపటం తనకు ఇబ్బందిగా అనిపించింది అని నాగవల్లి చెప్పింది. “ఎందుకంటే నాకు బయట ప్రపంచంలో తిరగడం ఇష్టం. ఈ జర్నలిజంలో చేయడం అంటే చాలా ఇష్టం. మొదట్లో ఈ విషయం అతనికి చెప్పడానికి ఇబ్బంది పడినా కూడా ఆ తర్వాత ధైర్యంగా చెప్పేశా. ఆరు నెలలోనే విడాకులు కూడా వచ్చేసాయి” అని చెప్పింది.
తనకు ఒక ఆరేళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. జీవితంలో తాను ఎన్నో నేర్చుకున్నట్లు…. ఎన్నో దేశాలకు వెళ్ళినట్లు ఒక భూకంపం న్యూస్ ని కూడా కవర్ చేసినట్లు దేవి గుర్తుచేసుకున్నారు. మనసులకు సంబంధించిన మాంసాన్ని కూడా ఒకానొక సమయంలో తాను చూశానని.. ఎంత కోటీశ్వరుడు అయినా కూడా చావు దగ్గర అందరు సాధారణ వ్యక్తులే అని దేవీ వివరణ ఇచ్చింది.