Devisri Prasad: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతి చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా దేవి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్.. మాస్ బీట్ లు… అందించడంలో సిద్ధహస్తులు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో తమన్ హవా కొనసాగుతోంది. చాలావరకు బిగ్ ప్రాజెక్టులకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ముఖ్యంగా అల వైకుంఠ పురం లో సినిమా పాటలు సోషల్ మీడియాలో సౌత్ ఇండియాలో అనేక రికార్డులు సృష్టించిన నాటి నుండి.. తమన్ కి చాలా మంది స్టార్ హీరోలు జై కొడుతున్నారు.
ఇక ఇదే సమయంలో అఖండ సినిమా కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి కూడా తమన్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతోంది. మరోపక్క ఇటీవలే పుష్ప తో మరోసారి తన సత్తా చాటిన దేవిశ్రీప్రసాద్…. అవకాశాలు కూడా ఇదే రీతిలో అందుకుంటున్నాడు. వాస్తవానికి తమ కంటే ముందే “శంకర్ దాదా ఎంబిబి ఎస్”.. పాటలు నాటినుండి వరుసపెట్టి ఇండస్ట్రీలో దాదాపు కొన్ని సంవత్సరాలపాటు దేవిశ్రీప్రసాద్ హవా కొనసాగుతోంది. కానీ మధ్యలో కొన్ని బ్రేకులు రావడంతో.. చతికిల పడ్డ కానీ మళ్లీ దేవిశ్రీప్రసాద్ పుంజుకున్నాడు. ఇదిలాఉంటే ఇటీవల ఓ ప్రముఖ స్టార్ హీరో సినిమాకి ఒక గంటలోనే సిక్స్ ట్యూన్స్ అందిం చేశాడట.
ఈ వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. పూర్తి విషయంలోకి వెళితే రవితేజ నటించిన కిలాడి సినిమా కి సంబంధించిన విషయాలు డైరెక్టర్ రమేష్ వర్మ.. తెలియజేస్తూ మ్యూజిక్ గురించి చర్చ వచ్చిన క్రమంలో దేవీశ్రీప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు అని చెప్పుకొచ్చారు. కేవలం గంటల్లోనే ఆరు ట్యూన్స్ అందించడం జరిగింది. ఆరు కూడా అదిరిపోయే రీతిలో డిఎస్పీ అందించారు షార్ట్ టైంలో.. డిఎస్పి మ్యూజిక్ పరంగా మంచి స్పీడ్ గా వర్క్ చేయడం తో సినిమా చాలా త్వరగా కంప్లీట్ చేసినట్లు డైరెక్టర్ తెలిపారు. ఇదిలా ఉంటే కిలాడీ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్లు రవితేజ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచినట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ సినిమా ఈ నెల 11 వ తారీకు రిలీజ్ కానుంది.