Yadagiri Gutta: తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అడ్డగోలుగా ఆలయ అధికారులు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఎప్పటి నుండో ఆరోపణలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మరోసారి భద్రాద్రి భక్తులకు ఆలయ అధికారులు ఊహించని షాక్ ఇస్తూ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి కొండ పైకి వాహనాలకు అనుమతి లేదని చెబుతూనే మరోపక్క వాహనాల రాకపోకలపై భారీగా చార్జీలను పెంచడం జరిగింది. ఈ క్రమంలో కొండపైకి అనుమతించే భక్తుల టు వీలర్స్ పార్కింగ్ కి పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తున్నారు.
ఈ క్రమంలో గంటకి ఏకంగా 500 రూపాయలను కొండపై పార్క్ చేసే టు వీలర్ కి ధర నిర్ణయించడం జరిగింది. ఇది కేవలం మొదటి గంట అనంతరం ప్రతి గంటకు వంద రూపాయలు చొప్పున చార్జీలు పెంచుతూ దేవస్థానం పార్కింగ్ ఈ విషయంలో చార్జీలు భక్తుల జేబులకు చిల్లులు పడేలా నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో యాదాద్రి భక్తులు ఆలయ అధికారుల అడ్డగోలు చార్జీల వసూళ్ల పై ఆగ్రహం వ్యక్తం చేసుకున్నారు. కొత్తగా కొండపైకి టూ వీలర్స్ విషయంలో ఆలయ కమిటీ తీసుకున్న టికెట్ ధరల నిర్ణయాలపై మండిపడుతున్నారు.
ఇటీవలే ఆలయ పునర్నిర్మాణం తరువాత కొండపైకి వాహనాలను దేవస్థానం అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్కింగ్ విషయంలో మరీ దారుణంగా చార్జీలు భక్తుల వద్ద వసూలు చేయడం పట్ల… ఆలయ అధికారుల పై యాదాద్రి భక్తులు మండిపడుతున్నారు. ఈ పరిణామంతో చాలామంది భక్తులు వాహనాలను కిందనే పార్కింగ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మరి కొంతమంది కొండపై పార్కింగ్ ధరల విషయం తెలుసుకుని టూవీలర్స్ వాహనాలను.. తీసుకు రాపోవడమే బెటర్ అనే ఆలోచనలో యాదాద్రి భక్తులు ఉన్నారట. ఏది ఏమైనా యాదగిరిగుట్ట కొండపై టూ వీలర్స్ పార్కింగ్ ధర .. భక్తుల వద్ద వందల్లో కలెక్ట్ చేయడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.