IPL Dhoni: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో సగం టోర్నీ ముగిసాక చెన్నై జట్టు కి కెప్టెన్ గా మళ్లీ ధోని బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. మొన్నటివరకూ జడేజా చెన్నై జట్టు కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది మ్యాచ్ లు ఆడగా… అందులో రెండు మాత్రమే గెలవగా ఆరు ఓడిపోయాయి. ఈ పరిణామంతో కెప్టెన్ బాధ్యత నుండి జడేజా తప్పుకుని… మళ్లీ ధోనీకి అప్ప చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ఇటీవల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా ఈ ఐపీఎల్ కి ధోని కెప్టెన్ గా లేకపోవడంతోపాటు ప్రారంభంలో.. జడేజా కెప్టెన్ కావటంతో అందరూ ఇదే ఫిక్స్ అయ్యారు. ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అని భావించారు. ఇటువంటి తరుణంలో ఆదివారం సన్ రైజర్స్ తో మ్యాచ్ సమయంలో టాస్ సందర్భంగా ధోని నెక్స్ట్ ఐపీఎల్ గురించి క్లారిటీ ఇచ్చారు. 2023 ఐపీఎల్ సీజన్ కూడా ఆడటం జరుగుతుందని.. వచ్చే ఏడాది కూడా తనను చెన్నై సూపర్ కింగ్స్ పసుపు జెర్సీలోనే చూస్తారని వెల్లడించాడు.
ఇక ఇదే సమయంలో ప్రస్తుతం చెన్నై జట్టు ఫీల్డింగ్ విషయంలో మెరుగుగా రాణించాలని.. జాగ్రత్త పడాలని ధోని పేర్కొన్నారు. బ్యాటింగ్ బౌలింగ్ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త పడితే.. బెటర్ అని అన్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం చాలా వరకు తక్కువ పాయింట్లతో ఐపీఎల్ సీజన్ లో దిగువన చెన్నై ఉంది. మరి ఇప్పుడు ధోనీ కెప్టెన్ కావటంతో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా అనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.