Diabetes: ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేదిస్తున్న సమస్య డయాబెటిస్.. ఇది చాప కింద నీరులా విస్తరిస్తుంది. ప్రతి సెకను కు ఒకరు డయాబెటిస్ తో చనిపోతున్నారు.. షుగర్ తో బాధపడుతున్న వారు ఖచ్చితంగా ఈ టైం లోనే అల్పాహారం తీసుకోవాలని తాజా అధ్యయనం చెబుతోంది..!!
Diabetes: తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
ఎండోక్రైన్ సొసైటీ లో ప్రచురించిన దాని ప్రకారం, నార్త్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనం ప్రకారం.. డయాబెటీస్ తో బాధ పడుతున్నారు ఉదయం 8:30 గంటల లోపు బ్రేక్ ఫాస్ట్నారు చేయాలి. ఈ పరిశోధనలో భాగంగా ఈ విధంగా అనేక మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు.. వారి రక్తంలో చక్కెర స్థాయిలు ఇన్సులిన్ నిరోధకత తగ్గుతూ వచ్చాయి. ఇన్సులిన్ నిరోధకత ఎక్కువ అయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అయితే అల్పాహారం ఉదయం త్వరగా తినటం వలన డయాబెటిక్ లెవెల్స్ తగ్గడం గమనార్హం. ఇన్సులిన్ నిరోధకత కూడా తగ్గిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువలన మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం త్వరగా బ్రేక్ ఫాస్ట్ చేయాలని వారు సూచించారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి ఓట్స్, కోడిగుడ్లు, పెసలు, అలసందలు వంటి ఆహారాలు తినాలి. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం నీరు తీసుకోవడం మన రక్తం లో చక్కెర స్థాయిలు నియంత్రణ లో ఉంటాయి. ఇన్సులిన్ లెవెల్స్ ను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
రాత్రి భోజనం తర్వాత ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి మధ్య లో సుమారు 10 నుంచి 12 గంటల వ్యవధి ఉంటుంది. ఈ సమయం లో మనం తీసుకునే అల్పాహారం లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండాలి. ఇది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఉదయం 8:30 కల్లా ప్రోటీన్ తో ఉన్న అల్పాహారం తీసుకుంటే డయాబెటిస్ లెవెల్స్ తగ్గుతాయని ఈ అధ్యయనం లో తేలిందని పరిశోధకులు చెప్పారు. ఇప్పటి నుంచి ఈ సమయం లోనే షుగర్ ఉన్న వారు అల్పాహారం తీసుకోవడం మంచిది.
షుగర్ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్దేశించుకుని ఆ టైం లోనే ఆహారం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ స్థాయిలు అదుపులో ఉంటాయి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. తీపి పదార్థాల జోలికి వెళ్లకుండా ఉండటం చేయాలి. ఎప్పటికప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకుంటూ షుగర్ నియంత్రణలో ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి.