బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా గత కొద్ది వారాలుగా పెద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది. రోజుకొక కొత్త సంగతి ఈ కేసులో బయటకు వస్తుంది. అయితే ఎటుచూసినా సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా నే నేరస్థురాలు అని అటు మీడియా.. ఇటు ప్రజలు భావిస్తున్నారు. రెండు నెలలు అవుతున్నా అతని మృతి వెనుక ఉన్న టాప్ సీక్రెట్ ఏమిటో బయట పడట్లేదు. సుశాంత్ కేసుని ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో బ్యాంక్ అకౌంట్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక కీలక సమాచారం బయటపడింది.
వివరాల్లోకి వెళితే ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు నమ్రత కనోడియా… సుశాంత్ బ్యాంక్ అకౌంట్లలో ఒకదాన్ని పరిశీలించారు. ఈ అకౌంట్ ద్వారా డబ్బు అత్యధిక శాతం ప్రయాణాలు, వ్యక్తిగత విలాసాలు, చారిటీలకు సహాయం, ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసమే ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో కొంత మొత్తం ప్రియ సోదరుడి కోసం ఖర్చు చేసినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను కనోడియా వెల్లడించారు.
గత ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు సుశాంత్ మొత్తం 4.6 కోట్లు ఖర్చు చేశారు. దానిలో ప్రయాణానికి 4.2 కోట్లు ఖర్చు చేశారు. ఇక నెలవారీగా అన్ని బ్యాంక్ అకౌంట్స్ ను గనుక పరిశీలిస్తే… తర్వాత వ్యక్తిగత విలాసాలకు 1.1 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇందులో కేవలం ప్రియ సోదరుడి కోసం 9.5 లక్షలు ఖర్చు చేశారట. దీనిలో వారి విమాన టికెట్ల కోసం 1.7 లక్షల రూపాయలు 4.72 లక్షలు రియా సోదరుడి హోటల్ ఖర్చు కోసం.. ఇకపోతే 3.4 లక్షలు రియా షాపింగ్, మేకప్ ఇతర ఖర్చుల కోసం వాడినట్లు కనోడియా క్లారిటీ ఇచ్చారు.
అంటే ఒక నెలకి ఈ మొత్తం యావరేక్ లెక్క వేసుకున్న కూడా రోజుకి దాదాపు రోజుకి 30 నుండి 40 వేల రూపాయలు సుశాంత్ కేవలం రియా కోసమే ఖర్చుపెట్టేవాడు. అది కూడా ఆమె తమ్ముడి ఇన్వాల్వ్మెంట్ టో. ఇక డైరెక్ట్ రియా కోసం ఖర్చు పెట్టిన మొత్తం రోజుకి లక్షల్లోనే ఉంటుందని అంచనా