ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం, పాలు, తాజా పండ్లు తీసుకోవడం, కషాయాలు తాగడం వంటి పనిలో పడ్డారు. రోగనిరోధక శక్తిని పెంచుకోనీ, కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఈ టీ తాగాల్సిందే? అయితే గత కొద్ది నెలల నుంచి ఈ టీని ప్రజలు ఎంతో ఇష్టపడి తాగుతున్నారు. ఈ కధా టీని తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి ఇక్కడ తెలుసుకుందాం..
ఈ కథని మన వంటింట్లో దొరికే సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి తయారు చేసుకోవడం వల్ల ఎటువంటి హానికర ప్రభావం మనమీద చూపదు. కొద్దిగా అల్లం, దాల్చిన చెక్క, తులసి, లవంగాలు, నల్ల మిరియాలు వీటిని బాగా వేడి నీటిలో మరిగించి వాటిని చల్లార్చి ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని తాగడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా మన దరిచేరవు. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఈ కధా టీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అయితే వీటిని రోజుకు కొద్ది పరిమాణంలో రెండుసార్లు మాత్రమే తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు. అంతేకాకుండా ఎక్కువ పరిమాణంలో ఈ టీని తాగడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఈ కధా టీని తాగడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయని కొందరు అపోహ పడుతుంటారు. కానీ ఈ టి కాలేయాన్ని దెబ్బతీస్తుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కానీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, విరోచనాలు, ఆడవారికి నెలసరి లో ఎక్కువ రక్తస్రావం కావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఈ కదా టీ ని మితంగా తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.
కదా టీని ఈ రోజు తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. అంతేకాకుండా తరచూ వచ్చే సీజనల్ వ్యాధులను కలిగించే బ్యాక్టీరియాల నుంచి పోరాడడానికి మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. కరోనా వంటి భయంకరమైన వైరస్ లను మన శరీరంలో ప్రవేశించకుండా రోగనిరోధక శక్తిని మెరుగుపరచి మన శరీరాన్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది.