Navel: ఇప్పటి తరం వారికి నాభి మర్ధన అంటే తెలియకపోవచ్చు గానీ.. అదేంటి అని అన్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.. నాభి మర్దన అంటే బొడ్డు చుట్టూ నూనె తో మసాజ్ చేయడం.. ఇది ఆయుర్వేద వైద్యంలో ఎప్పటి నుంచో ఉంది.. ఇలా చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.. ఏ నూనెలతో నాభి మర్దనా చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!
Navel: ఏ ఏ నూనెలతో నాభి మర్ధనా చేస్తే ఎటువంటి ఆరోగ్య ఫలితాలు కలుగుతాయో చూడండి..!!
శరీరానికి కేంద్ర బిందువు నాభి.. శరీరం లోని అన్ని నరాలకు బొడ్డు పేగు అనుసంధానమై ఉంటుంది. దేహం లోని చాలా వ్యాధులకు బొడ్డు పరిష్కార మార్గం.. నాబి లో నాలుగు చుక్కల నూనె వేసి మసాజ్ చేయడం వలన బొడ్డు అనుసంధానమైన నరాలు ఉత్తేజం అయ్యి ఏ అవయవం అయితే సరిగ్గా పనిచేయటం లేదొ ఆ నరాలు స్పందించి యాక్టివ్ గా పనిచేస్తాయి. ఇలా మసాజ్ చేయటం వలన కడుపు నొప్పి, గ్యాస్, కడుపులో మంట, ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. పొట్ట పెరగకుండా, అధిక బరువు తగ్గిస్తుందనడం సందేహం లేదు. పురుషులలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. స్త్రీలలో సంతానం కలిగేలా చేస్తుంది. సంతానోత్పత్తి సమస్యలు తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, పెదవులు తగలడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. నాభి మర్దన కు నెయ్యి, వేప నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె, బాదం నూనె లలో ఎదో ఒక ఆయిల్ తో మసాజ్ చేసుకోవచ్చు.
నువ్వుల నూనె..
రాత్రిపూట నిద్రించే ముందు నాలుగు చుక్కలు నువ్వుల నూనె నాభి లో వేసి ఐదు నిమిషాల పాటు మర్దన చేస్తే.. శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది. ఒత్తిడిని మటుమాయం చేస్తుంది. ఈ నూనెలో బలమైన శోధ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్లు, కండరాలు లో ఉండే దీర్ఘకాలిక నొప్పిని తగ్గిస్తాయి. పలు అధ్యయనాలలో నువ్వుల నూనె ఆస్టియో ఆర్థరైటిస్ ప్రభావాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు. బొడ్డులో నువ్వుల నూనె వేసి మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గించుకోవచ్చు.
ఆవనూనె..
అవును మనం వంటల్లో వినియోగిస్తారు అయితే ఈ నూనె లో అల్లెల్ ఐసోథియోసైనేట్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది శరీరంలోని కొన్ని నొప్పి గ్రాహకాలు డిసెన్సిటైజ్ చేస్తుంది. బొడ్డులో వేసి మర్దన చేయడంతో కీళ్ల నొప్పులు ను తగ్గిస్తుంది. శరీరంలో మంటలు, వాపులు తగ్గిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యల వలన కలిగే నొప్పిని తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ఆముదం..
ఆముదం నూనెను జుట్టు గా ఉంటుందని ఎక్కువ మంది దీనిని ఉపయోగించడానికి ఇష్టపడరు. ఆముదం చాలా ఔషధ గుణాలను కలిగి ఉంది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఇది చక్కగా పనిచేస్తుంది. నాభి లో ఆముదం వేసి మర్దన చేయటం వలన గొంతు కండరాలు నొప్పులు, నరాల మంట, ఆర్థరైటిస్ నొప్పి తగ్గిస్తుంది.
ఆలివ్ నూనెలో బొడ్డు లో వేసి మసాజ్ చేయటం వలన కీళ్ల నొప్పులు తగ్గుతాయి. బొడ్డులో కొంచెం వేప నూనె వేసి మసాజ్ చేయడం వలన నిర్జీవంగా ఉన్న మొహం కాంతివంతంగా మెరుస్తుంది. బాదం నూనెతో మసాజ్ చేయడం వలన మొటిమలు తగ్గి కాంతివంతంగా ప్రకాశిస్తుంది.