టైటిల్: ‘పరంపర 2’ వెబ్ సిరీస్
విడుదల తేది: జులై 21, 2022
ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఎపిసోడ్స్ 5
నటీనటులు: నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్, ఇషాన్, ఆకాంక్ష సింగ్, ఆమని,రవి వర్మ, బిగ్బాస్ దివి తదితరులు
కథ: హరి ఏలేటి
మాటలు: హరి ఏలేటి, కృష్ణ విజయ్ ఎల్
సినిమాటోగ్రఫీ: ఎస్వీ విశ్వేశ్వర్
ఎడిటింగ్: తమ్మిరాజు
సంగీతం: నరేష్ కుమరన్
నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వం: కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల
ఇంట్రడక్షన్:-
ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు ఎక్కువగా సినిమా ధియేటర్ల కంటే ఓటిటి కంటెంట్ లకి బాగా కనెక్ట్ అవుతున్నారు. పైగా సెన్సార్ కూడా లేకుండా ఉండటంతో ఓటీటీలో చాలా వైవిధ్యమైన వెబ్ సిరీస్ లు.. రకరకాల కార్యక్రమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీనిలో భాగంగానే డిస్నీ హాట్ స్టార్ లో గత ఏడాది డిసెంబర్ 24 వ తారీకు “పరంపర” అనే తెలుగు వెబ్ సిరీస్ విడుదలయ్యి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటి సీజన్ లోనే.. రివేంజ్ మరియు ఎమోషన్స్.. భావోద్వేగాలను హైలెట్ చేస్తూ పరంపర మొదటి సీజన్ తీయడం జరిగింది. కాగా తాజాగా రెండో సీజన్ ఇటీవల విడుదల చేయడం జరిగింది. యంగ్ హీరో నవీన్ చంద్ర, జగపతిబాబు, శరత్ కుమార్… వంటి కీలక నటులు నటించిన “పరంపర 2” సీజన్ వెబ్ సిరీస్ జులై 21వ తారీకు రిలీజ్ అయింది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన “పరంపర 2” వెబ్ సిరీస్.. విడుదలయ్యి దాదాపు 250 మిలియన్ మినిట్స్ వ్యూస్ రాబట్టడం తాజా రికార్డ్ గా నిలిచింది. మూడు తరాలకు సంబంధించిన స్టోరీతో రూపొందించిన ఈ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ లో బలమైన భావోద్వేగాలతో కూడిన కంటెంట్ ఉండటంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
రెండో సీజన్ లో మొత్తం ఐదు ఎపిసోడ్ లు ఉన్నాయి. మొదటి సీజన్ తో పోలిస్తే సీరిస్ నిడివిని చాలా వరకు తగ్గించేశారు. రాజకీయ నేపథ్యంలో “పరంపర 2” వెబ్ సిరీస్ తెరకేక్కించడంతో రెండు ఫ్యామిలీ మధ్య రాజకీయ ఎత్తుగడలు నువ్వా నేనా అన్నట్టు చూపించారు. అధికారం మరియు స్వేచ్ఛ కోసం పోగొట్టుకున్న పేరును కోల్పోయిన జీవితాన్ని తిరిగి సంపాదించుకోవడానికి నవీన్ చంద్ర పోరాడిన పోరాటాన్ని అద్భుతంగా చూపించారు. ప్రధానంగా నవీన్ చంద్ర మరియు జగపతిబాబు ఇంకా శరత్ కుమార్ పాత్రల మధ్య ఉత్కంఠ భరితమైన కథ కొనసాగుతుంది. పగ, ప్రతికారంతో పొలిటికల్ డ్రామాగా.. “పరంపర 2” డిస్నీ హాట్ స్టార్ లో దూసుకుపోతుంది.
స్టోరీ :-
మురళీకృష్ణ ప్రజానాయకుడిగా పేదల కోసం పనిచేసే నాయకుడిగా పేరు ఉంటుంది. కాగా మురళీకృష్ణ ఈ వెబ్ సిరీస్ లో వీరనాయుడు పాత్రలో నటించారు. వీర నాయుడు కొడుకులు మోహన్ రావు మరియు నాగేంద్ర నాయుడు. మోహన్ రావు పాత్రలో జగపతిబాబు నటించారు. వాస్తవానికి వీర నాయుడు కొడుకుగా మోహన్ రావు అనాధ అయిన గాని దత్తత తీసుకుని తన పెద్ద కొడుకు హోదా వీర నాయుడు కల్పించడం జరుగుతుంది. ఇంతకీ వీరనాయుడికి అసలు కొడుకు నాగేంద్ర నాయుడు. నాగేంద్ర నాయుడు పాత్రలో శరత్ కుమార్ నటించారు. ఈ క్రమంలో వీరనాయుడు మరణించగా ఆయన స్థానంలో వాస్తవానికి మోహన్ రావు రావాల్సి ఉండగా నాగేంద్ర నాయుడు కలుగజేసుకుని రాజకీయంగా ఎదుగుతాడు. దీంతో మోహన్ రావు కొడుకు పాత్ర గోపి గా నటించిన నవీన్ చంద్ర శరత్ కుమార్ పై రివెంజ్ తీర్చుకునే దిశగా.. తన తండ్రికి రాజకీయ స్థానం కల్పించే రీతిలో రెండో సీజన్ లాస్ట్ ఎపిసోడ్ ఉంది. బాబాయ్ నాగేంద్ర తో.. గోపి (నవీన్ చంద్ర) చేసే పోరాటం వేసే ఎత్తుగడలు చాలా హైలెట్ గా ఉంటాయి.
హైలైట్స్ :-
1)తన ప్రేమించిన అమ్మాయి పెళ్లి ఆపడం కోసం లైసెన్స్ లేని తుపాకీ వాడటంతో గోపి జైలుకెళ్లడం.. ఆ సమయంలో నాగేంద్ర నాయుడు వ్యవహరించిన తీరు కూడా ఎంతగానో ఆకట్టుగుంటది.
2)గోపి తండ్రి మోహన్ రావు అనగా జగపతిబాబు తన కొడుకుని జైలు నుండి బయటకు తెప్పించడానికి అధికారంలో ఉన్న నాగేంద్ర నాయుడు వద్దకు వెళ్తే గోపి క్షమాపణ చెబితే జైలు నుంచి బయటకు తీసుకొస్తానని అంటాడు కానీ గోపి ఎక్కడ కూడా తలవంచకుండా వ్యవహరించే తీరు బాగా ఆకట్టుకుంటుంది.
3)ఈ వెబ్ సిరీస్ మొత్తానికి నవీన్ చంద్ర నటన హైలెట్. గోపి పాత్రకు నవీన్ చంద్ర పూర్తి న్యాయం చేశాడు. ఆవేశం తో పాటు మైండ్ గేమ్ ప్లే చేస్తూ .. పాత్రకి వందకి 100% న్యాయం చేశాడు.
4)ఇక జగపతిబాబు… పాజిటివ్ గా కనిపిస్తూనే ఒకపక్క జనాలకు మంచి చేసే వ్యక్తిగా ఉంటూ మరోపక్క కొడుకు కోసం… ఎంత దూరమైనా వెళ్లే తండ్రిగా చాలా పవర్ ఫుల్ పాత్ర లో కనిపించారు.
5)ఇక శరత్ కుమార్ కూడా ఎక్కడ తగ్గేదేలే.. అన్నట్టు చాలా సన్నివేశాలలో స్టైలిష్ లుక్కుతో పాటు పవర్ ఉన్న పొలిటిషన్ పాత్రకి పూర్తి న్యాయం చేశారు.
6)ఇక మిగతా ఆకాంక్ష సింగ్, ఈశాన్, ఆమని, కస్తూరి పాత్రలు పరిధి మేర నటించి ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆమని.. పాత్ర ముగించిన విధానం చాలా ఎమోషనల్ డెప్త్ ఫీలింగ్ కలిగించింది. ఈ పరిణామంతో ఐదు ఎపిసోడ్ లు కలిగిన రెండవ సీజన్… ఇప్పుడు పరంపర మూడో సీజన్ పై మరింత ఆసక్తిని పెంచడంలో విజయం సాధించింది.
7)ముగింపు సన్నివేశాలను ప్రారంభంలోనే చూపించి… గోపి మరియు నాగేంద్ర పాత్రల మధ్య హోరాహోరీ పోటీ చాలా ఉత్కంఠ భరితంగా చూపించారు.
8)చివరి ఎపిసోడ్ లో గోపి జైలు జీవితం అక్కడ గొడవలు ఇంకా రాజకీయంగా బలంగా ఉన్న నాగేంద్ర నాయుడుని ఎదురుకోవడానికి గోపి.. జైలులో ఏర్పరచుకున్న స్నేహితులు.. కథ చాలా హైలెట్ గా నిలిచింది.
9)ఇంకా నాగేంద్ర బాక్సైట్ మాఫియా.. అదే రీతిలో గోపి తల్లి ఎన్నికలలో పోటీ చేయటం… వంటి ఉత్కంఠ భరితమైన పరిస్థితుల మధ్య నాగేంద్రరావు నిజ స్వరూపాన్ని.. బయట పెట్టడంతోపాటు, అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఓటమి నుండి తప్పించుకోవడానికి వదినని కూడా చంపడానికి నాగేంద్ర రెడీ అవ్వడం.. దర్శకుడు బాగా చూపించారు.
10)ఈ క్రమంలో చివరిలో మోహన్ రావు పాత్ర.. వచ్చే సీజన్ లో వైలెంట్ అయితే ఎలా ఉంటుందో.. చివరిలో చూపించటం సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు మోహన్ రావు పాత్రలో జగపతిబాబు చాలా సైలెంట్..గా ఉంటూ తమ్ముడు నాగేంద్ర నాయుడుకి పాజిటివ్ గా ఉన్నారు. కానీ ఎపిసోడ్ 5లో… నాగేంద్ర నాయుడు మొత్తం నిజస్వరూపం తెలియడంతో వచ్చే సీజన్..లో జగపతిబాబు నీ వైలెంట్ గా చూపిస్తున్నట్లు.. నాగేంద్ర పాత్ర పై వేసిన చివరి షాట్.. కంక్లూజన్ ఇచ్చినట్లు అయింది. దీంతో సీజన్ 3 మోహన్ రావు వర్సెస్ నాగేంద్ర గా ఉండనున్నట్లు తెలుస్తోంది.