Samantha: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ సపరేట్ గుర్తింపు సమంత దక్కించుకోవడం తెలిసిందే. ఏం మాయ చేసావ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత.. వరుసపెట్టి విజయాలు అందుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే ఆల్మోస్ట్ టాప్ హీరోల అందరి పక్కన సమంత నటించడం జరిగింది. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్… మాత్రమే కాదు తనకంటూ సెపరేట్ మార్కెట్ కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది.
ఒకానొక టైంలో గ్లామర్ పాత్రలు చేసిన సమంత నాగచైతన్యతో పెళ్లి అయిన తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయగా తర్వాత విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్లీ.. గ్లామర్ పాత్రలకుపెద్దపీట వేస్తూ సినిమాలు చేస్తూ ఉంది. ప్రజెంట్ మాత్రం ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తనదైన శైలిలో దూసుకుపోతోంది. వెబ్ సిరీస్ లో అదేవిధంగా స్పెషల్ సాంగ్ లలో కూడా తనదైన శైలిలో రాణిస్తోంది. ఇదిలావుంటే ఇటీవల సోషల్ మీడియాలో సమంతా.. మై మమ్..సైడ్ అంటూ స్ఫూర్తిదాయకమైన కొటేషన్ లతో కూడిన పోస్ట్ లు పెడుతూ ఉంది. ముఖ్యంగా తనని ట్రొల్ చేసే వారికి మొహం పగిలిపోయేలా… అదిరిపోయే రిప్లై ఇస్తూ ఉంది.
ముఖ్యంగా నాగచైతన్య తో విడిపోయిన తర్వాత సమంత పెడుతున్న పోస్టులు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో చాలా కంపెనీలు బ్రాండ్ ప్రమోషన్ కోసం సమంతాని ఆశ్రయిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో వాణిజ్య ప్రకటన కు సంబంధించి సామంత పెట్టే ప్రతి పోస్ట్ కు పాతిక లక్షల నుండి 30 లక్షల వరకు తీసుకుంటున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ గా నడుస్తోంది. అంతమాత్రమే కాదు పోస్ట్ లకి సంబంధించి అదనపు ఫోటోలు వీడియోలు షేర్ చేయాల్సి వస్తే అదనంగా రెండు నుంచి మూడు రెట్లు సమంత డిమాండ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో “శాకుంతలం” సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతోంది.