Rice Water: ప్రతి రోజూ మనం అన్నం వండేటప్పుడు కొంచెం సేపు బియ్యం నానబెట్టి తరువాత ఆ బియ్యాన్ని కడిగి అన్నం వండుతాం.. అయితే బియ్యం కడిగి ఆ నీటిని పారబోస్తూ ఉంటాం.. హా.. పారబోయకుండా ఏం చేస్తాం అని అనుకుంటున్నారా..!? బియ్యం కడిగిన నీటి లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి.. ఈ నీటితో ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం..!!
Rice Water: బియ్యం కడిగిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
ఈ నీటిలో పొటాషియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం, మ్యాంగనీస్ ఉన్నాయి. ఈ నీరు లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. బియ్యం కడిగిన నీరు జుట్టు సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నీటిని ఒక స్ప్రే బాటిల్లో పోసుకుని జుట్టు కుదుళ్ల కు పట్టించాలి. అర గంట తర్వాత నీటితో కడిగేసుకుంటే జుట్టు పట్టుకుచ్చులా మారుతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢంగా తయారవుతాయి. జుట్టు ఊడకుండా ఉంటుంది. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.
బియ్యం కడిగిన నీరు ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఈ నీటిని చర్మం కమిలి పోయిన, ఎర్రబడిన చోట స్ప్రే చేస్తే చర్మం తిరిగి మామూలుగా మారుతుంది. ముఖం పై స్ప్రే చేస్తే చర్మాన్ని బిగుతుగా ఉండేలా చేస్తుంది. ముఖం పై ఉన్న మొటిమలు, వాటి తాలూకు మచ్చలను తొలగిస్తుంది. చర్మం పై ఉండే దద్దుర్లు ను తగ్గించడంలో బియ్యం మీరు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నీటితో ముఖం కడుక్కుంటే ముఖం పైన ముడతలు పోతాయి.
బియ్యం కడిగిన నీరు లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ నీరు తాగితే షుగర్ లెవెల్స్ ను అదుపు లో ఉంచడానికి సహాయపడుతుంది. ఈ నీరు శరీరం లో ఉన్న వ్యర్థ బయటకు నెట్టి వేస్తుంది. దీంతో త్వరగా బరువు తగ్గుతారు. ఈ నీటిని తాగడం వలన తగ్గించి అలసట, నీరసం తగ్గించి తక్షణ శక్తి ని ఇస్తుంది. జీర్ణ క్రియ లో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని తగ్గిస్తుంది. మనం తీసుకునే ఎనర్జీ డ్రింక్ కంటే బియ్యం నీరు వంద రెట్లు మేలైనది. బియ్యం కడిగిన నీరు ప్రయోజనాలు తెలుసుకున్నారు కదా.. ఇప్పటి నుంచి మీరు కూడా ఈ నీటిని పారబోయకుండా ఇప్పుడు చెప్పుకున్న ప్రయోజనాలను ఆస్వాదించండి.