Fruit Combinations: ప్రతిరోజు ఒక పండు తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లే అవసరం లేదనే సంగతి అందరికీ తెలిసిందే.. పండ్లను నేరుగా తినడం ఆరోగ్యానికి మంచిది.. పండ్లలో విటమిన్లు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.. ఫ్రూట్స్ ను కొంతమంది మరి కొన్ని ఫ్రూట్స్ తో కలిపి తినడం అలవాటు.. అయితే ఇలా కొన్ని రకాల పండ్లను కలిపి తీసుకుంటే శరీరంలో విషం గా తయారై ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని సంగతి అందరికీ తెలియకపోవచ్చు.. ఎటువంటి ఫ్రూట్స్ ని కలిపి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..!!
జామ – అరటి పండు:
జామ, అరటి పండు ఈ రెండింటినీ కలిపి తినడం వలన కడుపు నొప్పితోపాటు తలనొప్పి కూడా వస్తుంది. అలాగే గ్యాస్ సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు..
అరటిపండు – పాయసం:
పాయసం లో అరటిపండు కలపకూడదు. అరటి పండు ని పాయసంలో కలిపి తింటే కడుపు ఉబ్బరం వస్తుంది. ముఖ్యంగా ఈ కాంబినేషన్ను పిల్లలకు ఇవ్వకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు
దానిమ్మ – నేరేడుపండు : ఈ రెండు పండ్లలో అధికంగా చక్కెర ప్రోటీన్ ఉంటాయి అందువలన వీటిని కలిపి తినడం వలన అసిడిటీ, అజీర్ణం, గుండెలో మంట వంటి సమస్యలు వస్తాయి.
బొప్పాయి – నిమ్మ :
బొప్పాయి, నిమ్మ కాంబినేషన్ ను అత్యంత ఘోరమైన కలయికగా భావిస్తారు వైద్యులు. ఈ రెండింటినీ కలిపి తింటే రక్తంలో హిమోగ్లోబిన్ కి సంబంధించిన సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా రక్తహీనతకు కూడా దారి తీస్తుంది.
నారింజ – క్యారెట్:
నారింజ క్యారెట్ను కలిపి తినడం ద్వారా మూత్రపిండ, పిత్తాశయ సంబంధిత సమస్యలు, గుండెల్లో మంట వంటి సమస్యలు బాధిస్తాయి.