బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో రెండవ వారం మొదటి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ అందరిపై విపరీతంగా ఫైర్ అయ్యాడు. అసలు నామినేషన్ ప్రక్రియ ను ఎవరూ ఎందుకు సీరియస్ గా తీసుకోలేదని అతను ప్రశ్నించాడు. నేను ఎలిమినేట్ అవుతాను అంటే నేను ఎలిమినేట్ అవుతాను అంటూ నామినేషన్స్ లో నిల్చున్న విధానాన్ని తప్పుపట్టాడు. అలాగే ప్రతి ఒక్కరికి అతివిశ్వాసం ఎక్కువ అయిపోయిందని అలాగే సేఫ్ గేమ్ ఆడుతున్నారని అది తాను జరగనివ్వం అని నాగార్జున తెలిపారు.
అలాగే ఈ వారంలో 2 ఎలిమినేషన్స్ ఉంటాయని చివర్లో నాగార్జున బాంబు పేలడంతో ఒక్కసారిగా కంటెస్టెంట్ లు కంగారు పడిపోయారు. మొదటి ఎలిమినేషన్ గా నిన్న కరాటే కళ్యాణి ఇంటి నుండి బయటకు వెళ్లి పోయింది. ఇది అందరూ ఊహించిన పరిణామమే అయితేనాడబల్ ఎలిమినేషన్ అంటూ చెప్పి నాగార్జున ఒక్కసారిగా వారందరికీ గూబులు పుట్టించాడు. అయితే ఇక్కడ డబుల్ ఎలిమినేషన్ అంటూ జనాలను పిచ్చోళ్లను చేయడానికి బిగ్బాస్ నిర్వహక టీమ్ సిద్ధమైందని అంటున్నారు.
గత మూడో సీజన్లో కూడా ఇలాగే చేశారు. ఉదాహరణకు గత సీజన్లో రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. దీంతో ప్రేక్షకులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రాహుల్ కి అప్పటికే బయట మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తీరా చూస్తే ఎపిసోడ్ అయిపోయాక అది ఫేక్ ఎలిమినేషన్ రాహుల్ ని సీక్రెట్ రూమ్ లో ఉంచారు. అలాగే ఈసారి కూడా ఒకరిని సీక్రెట్ రూమ్ కి బిగ్ బాస్ టీం పంపించాలనే యోచనలో ఉంది అని తెలుస్తుంది.
హౌస్ లో అందరూ జోక్స్ వేసుకుంటూ అనురాగాలు ఆప్యాయతలు అంటూ సేఫ్ గా తిరుగుతూ ఉంటే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ మజా రావడం లేదు. అదే 2వ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత ఒకరిని సీక్రెట్ రూమ్ లో ఉంచితే వారి గురించి అందరూ చెడుగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత సీక్రెట్ రూమ్ లో ఉన్న కంటెస్టెంట్ వచ్చి ఇక్కడ వీరిపై తమ ప్రతాపం చూపిస్తారు. అదే బిగ్ బాస్ ప్లాన్..!