DRDO: కోవిడ్ బాధితులకు కోసం డిఆర్డివో 2 డీజీ ఔషధం రూపొందించిన తెలిసిందే తాజాగా రెడ్డీస్ ల్యాబ్ 2 డీజీ ( డి ఆక్సి డి గ్లూకోజ్ ) ఒక్కోసారి సాచెట్ ధర రూ.990 గా రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. అయితే ప్రభుత్వానికి , ప్రభుత్వ ఆసుపత్రులకు డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది.. అయితే డిస్కౌంట్ ఎంత అన్నది ఇంకా స్పష్టం చేయలేదు..
2 డీజీ ఔషధాన్ని రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి డి ఆర్ డి ఓ ఆధ్వర్యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ తయారుచేసింది. ఆక్సిజన్ అవసరమైన కరోనా రోగులు త్వరగా కోలుకునేలా ఈ ఔషధం పనిచేస్తుందని డిఆర్డివో తెలిపింది. కోవిడ్ బాధితుల ట్రీట్మెంట్ కు 5 నుండి 10 వరకు సాచెట్స్ అవసరమవుతాయి. ఈ సాచెట్స్ ను నీళ్ళలో కలుపుకొని తాగాలి. ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ ఇటీవల అత్యవసర వినియోగ అనుమతిని ప్రకటించింది. మే 17న తొలి విడతగా 10 వేల సాచెట్స్, మే 27న రెండో విడతగా మరో 10 వేల సాచెట్స్ ను మార్కెట్ లోకి విడుదల చేయనుంది రెడ్డీస్ ల్యాబ్స్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?