Dream 11: ప్రస్తుతం బయట ప్రపంచంలో పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అర్థం కావడం లేదు. బలంగా ఉన్న మనిషి ప్రాణాలు పోయే పరిస్థితి ఒకవైపు కనిపిస్తే, మరోవైపు.. కటిక పేదరికం లో ఉన్నవాళ్లు రాత్రికి రాత్రే ధనవంతులు అయిపోతున్నారు. ఈ రీతిగానే తాజాగా కాశ్మీర్ రాష్ట్రంలో వసీమ్ అనే కుర్రోడు ఓవర్ నైట్ లో కోటీశ్వరుడయ్యాడు. దాదాపు ఒక రాత్రిలోనే అతని బ్యాంకు అకౌంట్లో కి రెండు కోట్ల రూపాయలు పడ్డాయి. ఆన్ లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లాట్ ఫామ్ డ్రీమ్ 11 అనే క్రికెట్ బెట్టింగ్ యాప్ లో గత కొంత కాలం నుండి వసిం బెట్టింగ్ ఆడుతున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే ఈ యాప్ లో రీసెంట్ గా వసీమ్ ఎంచుకున్న టీం.. మొదటి స్థానంలో నిలవడంతో యాప్ కు సంబంధించిన వసీమ్ ఎకౌంట్ లో రెండు కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయట. దీంతో మనోడు ఆనందానికి అవధులు లేవు. వసీమ్ రాజా చుట్టుప్రక్కల ప్రజలు.. ఈ విషయాన్ని తెలుసుకొని అభినందిస్తున్నారు. మొదట కల అనుకున్న గాని తర్వాత అకౌంట్… పరీక్షించుకుంటే నిజంగానే.. డబ్బులు పడి ఉండటంతో వసీం కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
డ్రీమ్ 11 అనేది ఒక ఫాంటసీ క్రికెట్. హాకీ, ఫుట్ బాల్, కబడ్డీ, బాస్కెట్ బాల్ ఆడేందుకు వినియోగదారులను అనుమతినిస్తుంది. 2019, ఏప్రిల్ లో డ్రీమ్ 11 యూనికార్న్ గా మొదటి భారతీయ గేమింగ్ కంపెనీగా అవతరించింది. అయితే ఇంత పెద్ద మొత్తం డబ్బు రావడంతో… అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి చికిత్స చేపిస్తాను అని వసీం చెప్పుకొచ్చాడు. పేదరికంలో ఉన్న తమకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుందని స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ న్యూస్ దేశవ్యాప్తంగా వైరల్ అవ్వుతోంది.