Drinking: రోజుకు ఒక పెగ్గు మందు ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. అదే పరిమితి దాటి తీసుకుంటే మన ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.. అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.. చాలా మంది మందు తాగేటప్పుడు టచింగ్ కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటుంటారు.. వాస్తవానికి మద్యం సేవించేటప్పుడు కొన్ని రకాల ఫుడ్స్ తినకూడదని..!? తింటే ప్రమాదమని మీకు తెలుసా..!? అవేంటో చూద్దాం..!!
మామూలుగా మందు తాగేటప్పుడు వేయించిన పల్లీలు, జీడిపప్పు తినడానికి ఇష్టపడతారు. అయితే వాస్తవానికి ఈ తినటం వలన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలో ఫ్యాట్ పెరిగి బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఫ్రై చేసిన బంగళా దుంప చిప్స్ తింటారు. ఫ్రైడ్ ఫుడ్స్ తింటే తింటే అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. మరి కొంతమంది స్వీట్స్ తింటుంటారు. మద్యం సేవించినప్పుడు స్వీట్స్ తినకూడదని, తినవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది మద్యం తాగిన వెంటనే పాలు తాగుతారు. మితంగా తాగితే పాలు తాగవచ్చు. అదే ఎక్కువగా మద్యం సేవించినప్పుడు పాలు తాగకపోవటమే మంచిదని సూచిస్తున్నారు. లేదంటే జీర్ణ సమస్యలు బాధిస్తాయని గుర్తుంచుకోండి.
అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మందు లో ఏదైనా కలుపుకుని తాగుతుంటారు. వాటిలో సోడా, కూల్ డ్రింక్స్ ఒకటి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకోకూడదు. ఇవి నీటి శాతాన్ని తగ్గిస్తుంది. డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అందువలన వీటికి బదులు నీళ్లు, ఐస్ క్యూబ్స్ ఉపయోగించండి. వీటిని కలిపి మద్యం తీసుకుంటే మంచిదే. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మితంగా తీసుకుంటూ పైన చెప్పిన పదార్థాలు తీసుకోకుండా ఉంటే కొంతవరకైనా ప్రమాదాన్ని తగ్గించవచ్చు.