Drishyam 2: మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన చిత్రం దృశ్యం 2.. ఇటీవలే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది.. దృశ్యం 2 తెలుగు వెర్షన్ లో విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.. దృశ్యం 2 తెలుగు వెర్షన్ ను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తాజా సమాచారం..
దృశ్యం 2 తెలుగు వెర్షన్ కు కూడా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళం నిర్మాణ సంస్థతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ లో సురేష్ బాబు ఈ రీమేక్ నిర్మిస్తున్నారు. జూన్ లో ఈ సినిమా విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నారు. కానీ పరిస్థితులు చూస్తే అప్పటి వరకు కరోనా తగ్గేలా కనిపించడం లేదు. కరోనా వైరస్ కారణంగా సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేసే పరిస్థితి నెలకొంది. దీంతో దృశ్యం 2 తెలుగు వెర్షన్ ను ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉందని తాజా సమాచారం. అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దృశ్యం 2 కు భారీ ఆఫర్ చేశారని టాక్..