సినీ ఇండస్ట్రీని గత కొద్ది రోజులుగా విపరీతంగా కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు స్టార్ హీరోయిన్ ల జోలికి వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ తర్వాత తాజాగా దీపికా పదుకొనే పేరు కూడా ఇందులో రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆ ప్రకంపనలు కాస్తా చిత్ర సీమ కథానాయికలను దాటి బుల్లితెర నటీనటులను కూడా తాకాయి.
ఈ లోపల శ్రద్ధ కపూర్, ఖాన్ దీపికా పదుకొనే లకు ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరిని మూడు రోజుల్లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీపికా పదుకొనె మాత్రం షూటింగ్ నిమిత్తం గోవాలో ఉంది. ఆమె షూటింగ్ కు ప్యాకప్ చెప్పి ముంబై వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుందట. ఈలోపల డ్రగ్స్ కేసులో బుల్లితెర నటుల పేర్లు బయట పడుతున్నాయి.
ప్రముఖ టీవీ నటి అభిగెల్ పాండే ఆమె బాయ్ఫ్రెండ్ కొరియోగ్రాఫర్ సనం జోహార్ నివాసాల్లో ఎన్సీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరిద్దరినీ ఎన్సీపీ కార్యాలయం లో హాజరుకావాల్సిందిగా ఆదేశించగా వీరు నేడు హాజరయ్యారు. ఈ క్రమంలో మాదకద్రవ్యాలు సరఫరాతో వీరికి ఉన్న సంబంధాలు కోణంలో అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు అని సమాచారం. అయితే వారు ఎవరి పేరు చెబుతారా అని ఇండస్ట్రీ మొత్తం భయంతో వణికిపోతుంది.
బాలీవుడ్లో చాలా లోతుగా డ్రగ్స్ దందా పాకిపోయిన విషయం తెలిసిందే. ఇక ప్రేక్షకులు కూడా తమ అభిమాన నటి నటుల పేర్లు ఎప్పుడైనా బయటికి వస్తాయో లేదా అని విపరీతంగా మదనపడుతూ ఉన్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!