Dry Dates: ఎండు ఖర్జూరాలు మన ఆరోగ్యానికి చాలా మంచిది అనే విషయం అందరికీ తెలిసిందే.. ఖర్జూరాలు కొలెస్ట్రాల్ ఉండదు.. వీటిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఉంటాయి. అందువలన ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరాల్లో విటమిన్-బి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.. తేనె లో వారం రోజులు నానబెట్టిన ఎండు ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం..
మూడు వంతుల తేనె కి , ఒక వంతు ఎండు ఖర్జూరాలు తీసుకొని ఒక గాజు సీసాలో వారంరోజులపాటు నిల్వ ఉంచాలి.. ఇలా తయారు చేసుకున్న ఎండు ఖర్జూరాలను రోజుకు ఒకటి లేదా రెండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఈ మిశ్రమం చక్కని పరిష్కారం. తేనే, ఖర్జూరం మిశ్రమం లో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
ఈ మిశ్రమం రక్తహీనతను తగ్గించి, ఎముకలను దృఢంగా ఉంచుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు వారంలో 3 రోజులు వీటిని తింటే సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యలను దూరంగా ఉంచుతుంది. శరీరంలో చెడు బ్యాక్టీరియాను తొలగించి, మంచి బ్యాక్టీరియా వృద్ధి అయ్యేలా చేస్తుంది. రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. ఈ మిశ్రమంలో యాంటీబయోటిక్ గుణాలు ఉండటం వలన గాయాలు త్వరగా మానుతాయి. జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. చిన్నారులు చదువులో చురుకుగా తయారవుతారు.