ఎప్పటినుండో ప్రారంభోత్సవం కోసం ఎదురుచూస్తున్న దుర్గ గుడి ఫ్లైఓవర్ ప్రారంభంకానుంది. విజయవాడ నడిబొడ్డున దుర్గమ్మ ఆలయం మీదుగా కట్టబడిన ఈ ఫ్లై ఓవర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో కలిసి వర్చువల్ గా ప్రారంభించనున్నారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో మొదలైన ఈ ఫ్లైఓవర్ అప్పటికే 85% కట్టబడింది. ఇక జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని పూర్తి చేసి అన్ని హంగులతో ఈనెల 16వ తేదీన ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు.
ఈ ప్రారంభోత్సవం ఎప్పుడో జరగవలసి ఉండగా కరోనా వ్యాప్తి కారణంగా తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ ఫ్లైఓవర్ వల్ల విజయవాడ వాసులకు ఇతర నగరాలకి వెళ్లేందుకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు.