సోషల్ మీడియా బాగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతోమంది తమ నైపుణ్యత నిరూపించుకునే ప్రయత్నం చేశారు. వారిలో కొన్ని వందల మంది చోటామోటా సెలబ్రిటీలు గా మారారు. అదే కోవలోకి వస్తాడు దుర్గారావు. ఈ మధ్య టిక్ టాక్ అనే యాప్ ద్వారా వెలుగులోకి వచ్చి బాగా ఫేమస్ అయిన దుర్గారావు కొద్దిరోజులుగా బుల్లితెరపై రచ్చ చేస్తున్నాడు. ఏకంగా తెలుగు స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ నే ఇప్పుడు టార్గెట్ చేశాడు.
ఆ వివరాలు ఏంటో చూస్తే.. ఎవరికి సాధ్యం కాని రీతిలో అతికొద్ది సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దుర్గారావు అతనిభార్య గంగారత్నం కలిసి చాలా కాలం నుండి కొత్త పాటలను వదలకుండా స్టెప్పులు వేసి ఫేమస్ అయిపోయారు. ఈ మధ్యకాలంలో బుల్లితెరపై చాలా షోలలో వీరు కనిపిస్తూనే ఉన్నారు. ఇక ఈ జోడీ బాగా ఫేమస్ అయిపోయింది. హైపర్ ఆది స్కిట్ తో జబర్దస్త్ లో అడుగుపెట్టిన వీరు.. నాగబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ‘అదిరింది’ షో లోకి సైతం అడుగుపెట్టింది.
సోషల్ మీడియా ట్రెండ్ సెట్టర్ అయినా దుర్గారావు అతని భార్య గంగారత్నం పలాస్ సినిమాలోని నక్కిలీసు గొలుసు పాట ద్వారా మరింత పాపులర్ అయ్యారు. ఇక వీరి పర్ఫార్మెన్స్ ను ఢీ షో లో డాన్స్ వేయడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన దుర్గారావు సీనియర్ హీరోయిన్ రోజా తో మాట్లాడుతూ మాకు ఏమీ పెద్దగా కోరికలు లేవు నీ పక్కన ఒక ప్లాస్టిక్ కుర్చీ వేసుకుని జడ్జిమెంట్ చెప్పుకుంటూ బ్రతికేయాలనుకుంటున్నా అని అన్నాడు.
దీంతో రోజా నోరు వెళ్ళబెట్టింది. ఇక వెంటనే దుర్గా రావు భార్య కూడా అతను పూర్తిచేసిన డైలాగ్ అందుకుని అందులో భాగంగానే ఆమె “ఏమండీ నాకు ఆ ఆ కుర్చీ కావాలి” అంటూ రేష్మి గౌతమ్ ఉన్న యాంకర్ సీట్ ను చూపించింది. దీంతో రష్మి కూడా దెబ్బకి అవాక్కయింది. దీనిపై ఔత్సాహికులు సోషల్ మీడియాలో మీమ్స్ తో చెలరేగిపోతున్నారు. దుర్గారావుకి పాపంలే అని ఛాన్స్ ఇస్తే విశ్వాసం లేకుండా వాళ్ళ కుర్చీలకే ఎసరు పెడుతున్నారు అని కామెడీగా అంటున్నారు.