Eatela rajendar: గత కొద్దికాలంగా జరుగుతున్న చర్చకు తెరదించుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీల చేరడం ఖరారైంది. ఈనెల 14న బీజేపీలో ఈటల చేరనున్నారు. ఈటలతో పాటు మరో కొంతమంది నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ మేరకు ప్రకటించారు.
Read More: Eatela Rajendar: ఈటలకు వెన్నుపోటు రుచి చూపిస్తున్న కేసీఆర్
బీజేపీ ఇంటికి ముఖ్య నేత
ఈటల రాజేందర్ బీజేపీలోకి రావడంపై ఆ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. బీజేపీ తెలంగాణ వ్యవహరాల ఇంచార్జీ తరుణ్ చుగ్ నేడు ఈటల నివాసానికి రానున్నారని సమాచారం. బీజేపీలో ఈటల చేరిక, పార్టీలో బాధ్యతలపై చర్చించనున్నట్లు సమాచారం. దీంతోపాటుగా ఈటలతో కలసిఇ పార్టీలో చేరేవారికి అప్పగించాల్సిన బాధ్యతలు, తదితర అంశాలు చర్చించనున్నట్లు సమాచారం.
Read More: Eatela Rajendar: స్పీకర్ ఫార్మాట్లో ఈటల రాజీనామా చేయనిది ఇందుకేనా?
బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన వ్యతికించిన ప్రతి ఒక్కరినీ టీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అరాచకాలను ప్రశ్నించే ప్రజాస్వామ్య గొంతుకలను అణిచి వేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమకారులను అన్ని రకాలుగా అణిచివేయడమే ఏకైక లక్ష్యంగా పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. కేబినెట్ లో కీలక మంత్రిగా పని చేసిన సీనియర్ నేత ఈటల రాజేందర్ కే భద్రత లేని పరిస్థితులు టీఆర్ఎస్ పెద్దలు సృష్టించారని మండిపడ్డారు. తెలంగాణ వాదులు, ప్రజాస్వామ్యవాదులు అందరికీ ఏకైక వేదిక బీజేపీ మాత్రమేనని బండి సంజయ్ అన్నారు.