Eatela Rajendar: మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఇటు ఈటల అటు టీఆర్ఎస్ పెద్దలు శ్రమిస్తున్నారు. అయితే, కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఈ ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ బై ఎలక్షన్ల లో బీజేపీ విజయం ఖాయమని జోస్యం చెప్పారు. దీంతో ఆయన కామెంట్లు చర్చకు దారి తీశాయి.
Read More : Eatela Rajendar: కేసీఆర్ స్కీం పెట్టినందుకు ఈటల కు పాలాభిషేకం చేశారు!
కోమటిరెడ్డి ఏమంటున్నారంటే…
తాను చేయించిన సర్వేలో హుజురాబాద్ ఉప ఎన్నికలలో బీజేపీ నేత ఈటల రాజేంధర్ పక్కాగా గెలుస్తారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేలిందన్నారు. ఈటలకు 67 శాతం, టీఆర్ఎస్కు 30 శాతం ఓట్లు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్కు ఐదు శాతానికి మించి ఓట్లు వచ్చే అవకాశం లేదని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తే కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని ఉపశమనం కలిగించే కామెంట్లు చేశారు. అయితే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కాంగ్రెస్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు.
Read More: KCR: ఆ కాంగ్రెస్ లీడర్ వల్లే.. ఈటలను బయటకు పంపించిన కేసీఆర్!
కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో పాలన కేటీఆర్ మిత్రుడు, ఆర్థిక కుంభకోణాలకు పాల్పడి ఏడేళ్లు జైలు శిక్ష అనుభవించిన సత్యం రామలింగరాజు కుమారుడు తేజరాజు చేతిలో ఉందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ, భువనగిరి లోక్సభ పరిధిలోని అన్ని ఎమ్మెల్యే స్థానాల్లోనూ కాంగ్రెస్ను గెలిపించడమే తన లక్ష్యమని వెంకటరెడ్డి అన్నారు.