Eatela Rajendar: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా చేయడంతో వచ్చిన హుజురాబాద్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు దృష్టిసారిస్తున్నాయి. అయితే, ఇప్పుడు ఈ ఉప ఎన్నిక వల్ల హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్తున్నారు. దళితుల సంక్షేమం కోసం దళితబంధు వంటి భారీ పథకం ప్రవేశపెట్టినట్లే మరో వర్గం సైతం లబ్ధిపొందినట్లు చెప్తున్నారు.
Read More: Eatela Rajendar: ఈటలకు భలే తీపి కబురు చెప్పిన కోమటిరెడ్డి
ఈటల ఖాతాలో ఇంకో పుణ్యం..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఖాతాలో మరో పుణ్యం చేరిందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా జర్నలిస్టులు ఇప్పుడు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల గ్రూపులోనూ చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే హుజురాబాద్ లో జర్నలిస్టులకూ పండగ వచ్చింది. విలేకరులకు కేటాయించిన ప్రభుత్వ స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి మంత్రి గంగుల కమలాకర్ శంకుస్థాపన చేశారు. ఇదీ “ఈటల రాజేందర్“ రాజీనామా పుణ్యమే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More: KCR: హుజురాబాద్కు షాకిచ్చి వాసాలమర్రిలో కేసీఆర్ ఆ మాట ఎందుకు చెప్పారంటే…
ఇప్పటికే పలు పథకాలు, ప్రయోజనాలు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల మూలంగా ఇప్పటికే వివిధ వర్గాలకు భారీగా ప్రయోజనం దక్కుతోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన ఓ నేతకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఇక ఇటీవలే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ స్థానం సొంతమైంది. దళితబంధు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా జర్నలిస్టులకు సైతం మేలు జరిగిందని అంటున్నారు.