Eatela Rajendar: భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొని టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి బర్తరఫ్కు గురై మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన పదవికి, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కట్టుకుంది ప్రగతిభవన్ కాదు.. బానిసల నిలయం అని ఆరోపించారు. కేసీఆర్కు తనకు ఐదేళ్ల క్రితమే మనస్పర్థలు వచ్చాయని ఈటల ఈ సందర్భంగా తెలిపారు. ప్రగతి భవన్లో స్వతహాగా నిర్ణయాలు తీసుకునే నాయకులు లేరని ఈటల ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై సైతం విమర్శలు గుప్పించారు. అయితే, ఆ కామెంట్లే ఇప్పుడు హస్తం పార్టీని ఆందోళనలో పడేస్తున్నాయి.
Read More: Corona: వాట్సాప్ తో కరోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవచ్చంటే…
కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు…
టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తూ ఆ పార్టీలోని అంతర్గత పరిణామాలపై స్పందించిన ఈటల రాజేందర్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైన విరుచుకుపడ్డారు. ఆ పార్టీని టీఆర్ఎస్ కంట్రోల్ చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కంట్రోల్లో తెలంగాణ కాంగ్రెస్ ఉందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ను వీడే సమయంలో ఈటల రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర గురించి సందేహాలు ఉన్న తరుణంలో టీఆర్ఎస్ లో ముఖ్య నేతగా ఉన్న ఈటల చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి.
Read More: Corona: సంతానంపై చైనా బంపర్ ఆఫర్ … కరోనా టైంలో ఇదో గుడ్ న్యూస్
కాంగ్రెస్ ఏమంటుందంటే…
ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ కంట్రోల్ చేస్తోందన్న ఈటల రాజేందర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇన్నాళ్ళు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే ఉన్న ఈటల రాజేందర్ ఇప్పుడు తమ పార్టీ గురించి పిచ్చి పిచ్చిగా మట్లాడుతున్నాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన నేత కాంగ్రెస్ పై తప్పుడు కామెంట్లు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.