Eatela Rajendar: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహించిన హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారిన సంగతి తెలిసిందే. ఈటల రాజీనామాతో వచ్చిపడుతున్న ఈ ఎన్నికకు ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు చేపడుతోంది. అభివృద్ధి కార్యక్రమాలకు ఓ వైపు నిధులు విడుదల చేస్తూ…మరోవైపు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు సత్వరం అందిస్తూ ముందుకు సాగుతోంది. దీంతో హుజురాబాద్ వార్తల్లోకి ఎకకుతోంది.
Read More: Eatela Rajendar: ఈటల కు అప్పుడే బీజేపీలో పొగ పెడుతున్న సీనియర్
హుజురాబాద్లో ఏం జరుగుతుందంటే..
హుజురాబాద్ పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 35 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పట్టణంలోని ప్రజల త్రాగునీటి అవసరాల కోసం రూ. 10.52 కోట్లు కూడా ఉన్నాయి. ఇక పట్టణంలోని వివిధ వార్డుల్లోని అభివృద్ధి పనుల కోసం రూ. 25 కోట్లను ఖర్చు పెట్టేలా ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. పట్టణంలోని అభివృద్ధి పనులను వీలైనంత తొందరగా మొదలుపెట్టి పూర్తి చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఒకటిన్నర నెల రోజుల్లోనే పూర్తి చేసేలా ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. అనుకున్న సమయానికి పనులు పూర్తయ్యేలా చూసేందుకు స్పెషల్ ఆఫీసర్లను కూడా నియమించాలని జిల్లా అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించడం గమనార్హం.
Read More: Eatela rajendar: టీఆర్ఎస్ లో ఎదగాలంటే… ఈటలను తిట్టాల్సిందే
ఇదో కొత్త ట్రెండ్
మరోవైపు హుజురాబాద్ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలుపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇంతకాలం ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ఈటల రాజేందర్ ప్రభుత్వం దృష్టికి పలు అంశాలను తీసుకెళ్ళినా పరిష్కారానికి నోచుకోలేకపోయాదని అంటున్నారు. అయితే, ఇప్పుడు కొత్తగా అర్హులైనవారికి రేషను కార్డులను అందించడం, వృద్ధులకు ఆసరా పింఛన్లను అందేలా చూడడం, కల్యాణలక్ష్మి-షాదీముబారక్ చెక్కులు వెంటనే ఇవ్వడం.. ఇలాంటి ఎన్నో పెండింగ్ అంశాలు ఇప్పుడు ఈటల రాజేందర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతుండడంతో ఆయనను ఢీకొట్టడానికి వెంటనే మంజూరు చేస్తోంది.