Eatela Rajendar: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ అనేక మలుపులు తిరిగి ఎట్టకేలకు బీజేపీలో చేరికతో ఫుల్ స్టాప్ పడిన సంగతి తెలిసిందే. అయితే, త్వరలో జరగబోయే ఉప ఎన్నిక ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు ఈటల పొలిటికల్ జర్నీపై టీఆర్ఎస్ ఎదురుదాడి కొనసాగుతోంది. తాజాగా మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ ఈటెల రాజేందర్ బీజేపీ లో చేరడం హాస్యాస్పదమని అన్నారు. ఆయన చెప్పే మాటలకు చేసే పనులకు పోలిక లేదని ఆరోపించారు.
Read More: Eatela rajendar: ఈటల చేసిన పనికి కేసీఆర్ టెన్షన్ పడపోతున్నారుగా
హిట్లర్ వారసులు….
టీఆర్ఎస్ పార్టీలో ఈటల కు ఎలాంటి ఇబ్బందులు లేవని జగదీశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. తేడాలు వస్తే మాట్లాడుకునే ప్రయత్నం కూడా ఆయన చేయలేదని ఆరోపించారు. మునిగిపోయే పడవలో ఈటల ఎక్కాడని ఎద్దేవా చేసిన మంత్రి ఆయన వెంట ఎవరు వెళ్లినా మునిగిపోవాల్సిందేనని జోస్యం చెప్పారు. బీజేపీ లోకి వెళ్లి ప్రజలకు ఏ విదంగా న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. హిట్లర్ వారసులు దగ్గర చేరి నియంతృత్వం పోరాటం చేస్తా అంటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Read More: Eatela Rajendar: రాజీనామాతో రెండు రికార్డులు సృష్టించిన ఈటల
ఎవరిపైనా భూకబ్జా ఆరోపణలు రాలే
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మరో సంచలన కామెంట్ చేశారు. తమ పార్టీలో ఎవరిపైన భూకబ్జా ఆరోపణలు రాలేదని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ఈటలపై భూకబ్జా ఫిర్యాదులు వచ్చాయని.. విచారణ పూర్తి అయ్యే వరకు ఈటల ఆగాల్సింది అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కన్నా ఎక్కువ బీజేపీ లో ఏముందో చెప్పాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ కు పట్టిన గతే తనకూ పడుతుందని కొందరు కలలు కంటున్నారని..అది కలలో కూడా జరగదని జగదీశ్ రెడ్డి చెప్పుకొచ్చారు.