Eatela Rajendar: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్ రావుపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో జరిగిన బీజేపీ నాయకులు,కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఈటల సీఎం కేసీఆర్ మెప్పు పొందాలని మంత్రి హరీశ్ రావు చూస్తున్నారని ఆరోపించారు. హుజురాబాద్ ప్రజలను తీసుకుపోవాలి… దావత్ ఇయ్యాలే, డబ్బులు ఇయ్యాలే ఇదే హరీశ్ రావు పని అన్నారు. హరీశ్ సీఎం మెప్పు పొందాలేరు కానీ.. ఆయనకు కూడా తన గతే పడుతుందని ఎద్దేవా చేశారు.
Read More: Eatela rajendar: ఈటలకు హుజురాబాద్లో ఎదురయ్యే అసలు సమస్య ఇదేనా?
వాళ్లు బానిసలు…
ఎన్ని కొట్లైనా ఖర్చు పెట్టి హుజురాబాద్ లో గెలవాలని టీఆర్ఎస్ చూస్తుందని ఈటల రాజేందర్ ఆరోపించారు. టీఆర్ఎస్లో కొంతమంది ఎమ్మెల్యేలు బానిసలుగా ఉన్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. అలాంటి వాళ్లంతా ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. రాబోయే కాలంలో వాళ్ల నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు స్క్రిప్ట్ రాసి పంపించి మాట్లాడిపిస్తున్నారని ఈటల ఆరోపించారు. సీఎస్, డీజీపీ చట్టానికి లోబడి పనిచేస్తున్నారా.. చుట్టంగా పనిచేస్తున్నారా చెప్పాలని ఈటల ప్రశ్నించారు. ఇతర పార్టీల నుండి ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మంత్రులను చేసిన ఘనతే కేసీఆర్దేనని ఈటల ఎద్దేవా చేశారు.
Read More: Eatela Rajendar: ఈటల విషయంలో కేసీఆర్ ఎక్కువ పరేషాన్ అవుతున్నది ఎందుకంటే…
అప్పుడే కుట్రలు….
తాను వరంగల్ మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో ఉండగానే కేసీఆర్ తనపై కుట్రలు చేశాడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. వాళ్ళ అబద్ధాల పత్రిక, అబద్దాల ఛానల్ లో పదే పదే అబద్ధాలు చెప్పారని ఫైర్ అయ్యారు. బానిసగా బ్రతికిన చరిత్ర, బ్రతికే చరిత్ర తమకు లేదని ఈటల వెల్లడించారు. డబ్బును, ప్రలోభాలను పాతరవేసే సత్తా హుజురాబాద్ ప్రజలకు ఉందన్నారు. ప్రాణాన్ని లెక్కచేయకుండా పోరాటం చేసిన గడ్డ హుజురాబాద్ అని పేర్కొన్న ఈటల రాబోయే కాలంలో అదే స్ఫూర్తితో ఫలితం అందిస్తుందన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?