Eatela Rajendar: టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నెల 14న బీజేపీ తీర్థం తీసుకున్న ఈటలపై పార్టీ మారినప్పటి నుంచి టీఆర్ఎస్ నాయకులు మాటల దాడి చేస్తున్నారు. దీంతో పాటుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్కు బీజేపీలో చేరుతునన సమయంలోనే అవమానం జరిగిందని మరికొందరు నెట్టింటి కామెంట్ చేస్తున్నారు. ఇక దీనికి తోడుగా తాజాగా మావోయిస్టుల నుంచి సైతం ఈటల విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
Read More: Eatela Rajendar: ఈటల టీఆర్ఎస్లోనే ఉంటే ఏం జరిగేదో తెలుసా…. ఆ ఒక్కడూ ఆయనేనట!
ఈటల బ్యాడ్ టైం కాకపోతే ఇంకేంటి?
ఈటల రాజేందర్ కు మంత్రి పదవి నుంచి మొదట ఉద్వాసన, అనంతరం ఆయన ఇటు టీఆర్ఎస్ పార్టీకి అటు ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేయడం చకచకా జరిగిపోయాయి. వివిధ పార్టీల నాయకులతో తన తదుపరి అడుగుపై ఆంతరంగిక మంతనాలు నిర్వహించిన ఈటల అనంతరం అనుచరులను తీసుకుని ఢిల్లీ వెళ్లి కాషాయా కండువా మెడలో వేసుకున్నారు. అయితే, ఈ సమయంలో ఆయనకు అవమానం జరిగిందని కొందరు అంటున్నారు. ఇక అసలు ఈటల బీజేపీలో చేరడమే పెద్ద తప్పని టీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లకు తోడుగా తాజాగా మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు.
Read More: Eatela rajendar: టీఆర్ఎస్ లో ఎదగాలంటే… ఈటలను తిట్టాల్సిందే
మావోయిస్టులు ఏమంటున్నారంటే…
అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఈటల ఇచ్చిన ప్రకటనను తెలంగాణ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఖండించారు. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేస్తూ ఈటల ఏం మాట్లాడరో గుర్తుకు చేసుకోవాలని తెలంగాణ మావోయిస్టు పార్టీ పేర్కొంది. కేసీఆర్ ఫ్యూడల్ పెత్తనానికి వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తాను పోరాడతానని పేర్కొన్న ఈటల అనంతరం హిందుత్వ పార్టీ అయిన బీజేపీలో చేరడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు తూట్లు పొడిచే విధంగా పరిపాలన చేస్తోందని ఆరోపించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?