క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ వ్యాపార లావాదేవీలపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చికోటి ప్రవీణ్, మాదవరెడ్డి సహా ఏడుగురికి ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. ఫైట్స్ ఆపరేటర్ సంపత్ తో పాటు మరో నలుగురు హవాలా ఏజెంట్లకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. సోమవారం ఈడీ కార్యాలయానికి విచారణకు హజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ప్రవీణ్,మాధవరెడ్డి బ్యాంకు ఖాతాల నుండి దాదాపు రూ.25 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఇడీ అధికారులు గుర్తించారు.
ఈడీ అధికారుల దర్యాప్తులో ప్రవీణ్, మాధవరెడ్డి ఖాతాల నుండి పలువురు రాజకీయ నేతలు, అధికారులకు సైతం నగదు బదిలీ జరిగినట్లు వెల్లడైనట్లు తెలుస్తొంది. ఆయా లావాదేవీలపై పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఏడాది వ్యవధిలో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డిలు గోవా, శ్రీలంక. ధాయిలాండ్ నేపాల్ లో భారీ ఈవెంట్లు నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే హవాలా మార్గంలో నగదును ఇక్కడ నుండి తీసుకువెళ్లి తిరిగి ఇక్కడకు తీసుకొచ్చినట్లు ఈడీ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని అంటున్నారు. ఇందు కోసం హైదరాబాద్ లోని బేగంబజార్. జూబ్లీహిల్స్ కి చెందిన ఇద్దరు హవాలా ఏజెంట్ల సాయం తీసుకున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘన లో పూర్తి ఆధారాల సేకరణలో ఈడీ నిమగ్నమైనట్లు తెలుస్తొంది.