Election Manifesto : తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి తన మేనిఫెస్టోను రిలీజ్ చేశాడు.. చిత్రవిచిత్రమైన హామీలను ఆ మేనిఫెస్టోలో ప్రకటించడం విశేషం..
దక్షిణ మధురై నుంచి పోటీ చేస్తున్న శరవణన్ అనే అభ్యర్థి తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి ఒక ఐఫోన్, కారు, హెలికాఫ్టర్, రోబో ఇస్తానని వాగ్దానం చేశాడు.. ఇవే కాదు స్విమ్మింగ్ పూల్ ఉన్న మూడు అంతస్తుల ఇంటిని, యువతకు కోటి రూపాయలతో పాటు వంద రోజుల పాటు చంద్రుడి మీదకు టూర్ కి తీసుకు వెళతాను అంటూ హామీ ఇచ్చాడు.. మధురై లో స్పేస్ రీసెర్చ్ సెంటర్, రాకెట్ లాంచ్ సైట్, ఆర్టిఫిషియల్ ఐస్ బర్గ్ ను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశాడు. ఎన్నికల వేళ పార్టీలు నేతలు హామీలు ఇచ్చి ఆ తరువాత మరచిపోతుంటారని, ఓటర్లకు ఆ విషయాన్ని గుర్తు చేద్దామన్న ఉద్దేశంతో ఇలాంటి హామీలు ఇచ్చినట్టు తెలిపాడు.. సంక్షేమ పథకాలు ప్రకటించే పార్టీలు ఆ తర్వాత వాటిని అమలు చేయావని , దానిపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి హామీలతో మానిఫెస్టో రిలీజ్ చేసినట్లు ఓ మీడియాతో తెలిపాడు.