Vijayawada Electric Bike: దేశంలో ఎలక్ట్రిక్ బైక్ వినియోగం రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకపక్క పెట్రోల్ రేటు ధరలు ప్రభుత్వం పెంచుకుంటూ పోతూ ఉండడంతో… ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్ లో భారీ డిమాండ్ పెరిగింది. ఇటువంటి తరుణంలో ఇటీవల ఎలక్ట్రిక్ వాహన దారులు కొనుగోలు చేసి.. ఛార్జింగ్ పెడుతున్న సమయంలో ఒక్కసారిగా పేలిపోయిన ఘటనలు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉన్నాయి. మొన్ననే పూణేలో ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో… ఏపీలో మొన్న కాకినాడలో పేళ్ళగా నేడు విజయవాడలో చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు పేలడం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే సూర్యారావు పేట లోని గులాబీ పేటకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి… నిన్ననే కొత్తగా ఎలక్ట్రిక్ బైక్ కొనడం జరిగింది. ఈ క్రమంలో బైక్ బ్యాటరీ కి రాత్రి పడకగదిలో చార్జింగ్ పెట్టి కుటుంబం మొత్తం నిద్ర పోవడం జరిగింది. అయితే తెల్లవారేసరికి భారీ శబ్ధంతో బ్యాటరీ పెలిపోయింది. ఇక ఇదే సమయంలో మంటలు అంతటా వ్యాపించడంతో… శివకుమార్ మరియు అతడి భార్య పెట్టి గట్టిగా కేకలు వేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలో భార్య పిల్లలను ఇరుగుపొరుగు వాళ్ళు కాపాడగా మంటల్లో చిక్కుకున్న శివకుమార్… అనేక గాయాలతో బయటపడ్డాడు. దీంతో శివ కుమార్ ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించడం జరిగింది. దీంతో ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన దారులు.. చార్జింగ్ పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అయితే ఈ బ్యాటరీ ప్రమాదాలకు గల కారణం… నమోదవుతున్న ఉష్ణోగ్రతలు అని అంటున్నారు. ఏది ఏమైనా దేశంలో ఎలక్ట్రిక్ బ్యాటరీ పేలే ఘటనలు.. ఉన్న కొద్దీ ఎక్కువ అవుతూ ఉండటంతో… ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు విషయంలో… వాహనదారులు కన్ఫ్యూజన్ లో పడ్డారు.