ESI Scam: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఎస్ఐ స్కామ్ ఎంత పెద్ద దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రస్తుతం ఈ స్కామ్ కేస్ లో దర్యాప్తు ఇంకా జరుగుతోంది.. ఈరోజు మరో నలుగురిని ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు..
సూపరింటెండెంట్ రవి కుమార్ తో పాటు అతని బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు ఎసిబి అధికారులు.. డాక్టర్ రవి కుమార్ ను ఈ కేసులో A23 గా ఉన్న వెంకటేశ్వర్లు ను హైదరాబాద్ బంజారాహిల్స్ లో అరెస్టు చేశారు అధికారులు. వీరితోపాటు మెడిసన్ కు సంబంధించి ఓమ్ని ఎంటర్ప్రైజెస్, హెల్త్ కేర్ అధినేతగా ఉన్న కంచర్ల శ్రీహరి అలియాస్ బాబ్జీ తో పాటు అతని భార్య సుజాత కూడా అరెస్టు చేశారు ఎసిబి అధికారులు. మెడికల్ ఎక్విప్మెంట్ నిర్వహణ పేరుతో టిడిపి హయాంలో భారీగా అక్రమాలు జరిగినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ విషయంలో కొంత మందిని అరెస్టు చేసిన అధికారులు తాజాగా మరో నలుగురిని అరెస్టు చేశారు.. ఈ స్కామ్ లో గతంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.