ఈఎస్ఐ మెడికల్ స్కాం కి సంబంధించి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో హైకోర్టు ఈ మధ్య జరిగిన పరిణామాలు చూస్తేనే అర్థం అవుతుంది. అచ్చెన్నాయుడి ఆరోగ్య పరిస్థితి అంతగా బాగోలేకపోయినా హైకోర్టు వారిని ఒప్పించి మరీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఏసీబీ అధికారులు విచారణకు అనుమతి తీసుకున్నారు.
అయితే ఇదంతా తెలుగుదేశం పార్టీలోని మరొక సీనియర్ నేతను కంగారు పెడుతోంది. అతనే పితాని సత్యనారాయణ. ఈ కేసులో తన కుమారుడి పైన కూడా ఆరోపణలు రావడంతో ముందస్తు బెయిల్ దిశగా అతని కుమారుడిని ప్రేరేపించిసినట్లు కనిపిస్తోంది. పితాని సత్యనారాయణ తనయుడు సురేష్ ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పితాని వద్ద పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన మురళీమోహన్ కూడా సురేష్ తో పాటు ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాన్ని అభ్యర్థించడం మరొక విశేషం. అయితే ముందస్తు బెయిల్ కి సంబంధించి న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
ఇకపోతే అచ్చెన్నాయుడు ని ముందు పెట్టి తెరవెనుక వ్యవహారాలన్నీ పితాని సత్యనారాయణ కొడుకు, ఇంకా మరి కొందరు టిడిపి నేతల వారసులు నడిపించారు అని ముందు నుండి వైసిపి చేస్తున్న ఆరోపణల్లో నిజానిజాల మాట పక్కన పెడితే ఈ ‘ముందస్తు బెయిల్’ అంశం నేపథ్యంలో ఈ వ్యవహారంలో పితాని సత్యనారాయణ కొడుకు పాత్ర ఎంత ఉందో సుస్పష్టమవుతోందని వైసిపి కుండబద్దలు కొట్టేస్తోంది.
“ఆ స్కామ్ విషయంలో మాకేం సంబంధం లేదు..”అని ఇప్పటికే పితాని సత్యనారాయణ స్పందించారు. కానీ, తెరవెనుక వ్యవహారాలు వేరేలా వున్నాయి. “అచ్చెన్నాయుడికి ఇంకా బెయిల్ రాలేదంటే, కేసులో సీరియస్నెస్ ఎక్కువగానే వున్నట్టు లెక్క..” అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ. “అబ్బే, అది అసలు అచ్చెన్నాయుడికి సంబంధం లేని వ్యవహారం..” అని టీడీపీ అంటోంది. “అచ్చెన్నాయుడికి సంబంధం లేకపోతే ఈ పాతికి బెయిల్ రావాలి కదా.. మరి సంబంధం ఉన్న వ్యక్తులు బయట ఉన్నారా?” అన్నది వైసీపీ వాదన. మరి మీకేం అనిపిస్తుంది?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?