Banana Flower: సామాన్యుడి ఆపిల్ గా అరటి పండు ను అభివర్ణిస్తారు.. ఇది పోషకాల గని.. అరటి పండే కాదు అరటి పండు పువ్వు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వాస్తవానికి అరటి కంటే అరటి పువ్వులోనే పోషకాలు మెండుగా ఉంటాయి.. బ్రాహ్మణుల ఇళ్లలో అరటి పువ్వు కూర వండుతుంటారు.. అయితే అరటి పువ్వు కూర తింటే కలిగే లాభాలు ఏంటో తెలుసా..!?
అరటి పువ్వు కూర వండడం చాలా తేలిక. ఇందులో ఉన్న ఉన్న పోషకాలు గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా తింటారు. ఇందులో క్యాలరీలు తక్కువ ఉంటాయి. దీంతో బరువు తగ్గడం సులువు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తి, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఉదర సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
మధుమేహగ్రస్తులు అరటి పువ్వు కూర తింటే డయాబెటిస్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఈ పువ్వు అద్భుతంగా పనిచేస్తుంది. మధుమేహులు ఖచ్చితంగా వారంలో రెండు సార్లు ఈ కూరలు తింటే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం ను అరికడుతుంది. ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి, చిరాకు ను తగ్గిస్తుంది. ఈ కూరను బాలింతలు తీసుకుంటే పాలు వృద్ధి చెందుతాయి. అరటి పువ్వు లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వృద్ధాప్య ఛాయలను తొలగించి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. ఈ కూర తీసుకుంటే కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.