Thunga Gaddalu: తుంగ గడ్డి ఇళ్ళ దగ్గర, పొలాల గట్లపై విరివిగా పెరుగుతుంది.. దీనిని కలుపుమొక్క గా భావించి ఎక్కువ మంది పట్టించుకోరు.. తుంగ గడ్డి పికేస్తే అడుగున తుంగ గడ్డలు ఉంటాయి.. వీటిని తుంగ గడ్డలు, తుంగ బొటికలు, తుంగ ముస్తలు, భద్ర ముస్తలు, నాగర ముస్తలు అని పిలుస్తారు.. వీటిలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి.. ఈ తుంగ గడ్డలు మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు..!!
Thunga Gaddalu: తుంగ గడ్డల కషాయం తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!
తుంగ గడ్డలు పొడిని ఒక స్పూన్ తీసుకుని రెండు గ్లాసులు నీటిలో వేసి కలిపాలి. ఇవి ఒక గ్లాసు అయ్యే వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయం తాగితే జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అరుగుదల శక్తి పెరుగుతుంది. కామెర్లు తగ్గుతాయి. కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. రక్తం వృద్ధి చెందుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఒక స్పూన్ తుంగ గడ్డల పేస్ట్ కి ఒక స్పూన్ తేనె కలిపి ఒక చెంచా చొప్పున తీసుకుంటే ప్రేగు సమస్యలు తగ్గుతాయి. తుంగ బోటి కళ్ళను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని నుదుటిపై రాస్తే తలనొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది.
Thunga Gaddalu: తుంగ బొటికలు నూనె బట్ట తలకి చెక్ పెడుతుంది..!!
తుంగ గడ్డి పికితే అడుగున తుంగ గడ్డలు ఉంటాయి.. వాటిని పగలకొడితే అడుగున సువాసన వెదజల్లే తుంగ బొటికలు ఉంటాయి.. ఈ తుంగ బొటికల వాసన పీలిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.. బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తుంది.. ఈ తుంగ బొటికలను కొబ్బరి నూనె లో వేసి నానబెట్టాలి. ఈ నూనె తలకు రాసుకోవడం వల్ల జుట్టు ఊడకుండా, తెల్ల బడకుండా, ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు పోతుంది. జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇస్తుంది. ఎలా తయారు చేస్తారు. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. తుంగ పట్టికలను మెత్తగా నూరి నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. నూనె మాత్రమే మిగిలే వరకు మరిగించి వడపోయాలి. ఈ నూనెను బట్ట తల ఉన్నవారు రాసుకుంటే కొత్త వెంట్రుకలు మొలుస్తాయి. ఈ నూనెను రోజుకు మూడు సార్లు రాసుకోవాలి. ఇలా రాస్తే త్వరగా వెంట్రుకలు మొలుస్తాయి చుండ్రు సమస్య తగ్గుతుంది. తుంగ గడ్డలు సేకరించి వాటిని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే, చర్మం పై ఉన్న నలుపు, మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోగొట్టి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.. తుంగ బోటికలను ఎండబెట్టి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్పూన్ పొడిని మంచి నీటిలో కలిపి చర్మానికి రాసుకుని ఒక గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోయి, చర్మం తెల్లగా అవుతుంది. ఇలా ప్రతి రోజూ చేయడం వల్ల చర్మం నిగారిస్తుంది.