ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో, ఒకటిగా భారత్ వృద్ధి చెందుతుందని రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ తెలిపారు. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ తో కలిసి వేదికగా పంచుకున్న ముఖేశ్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే రెండు దశాబ్దాల్లో భారత్ వెలుగొతుందన్నారు.. తలసరి ఆదాయం కూడా పరెట్టింపు అవుతుందని ముకేష్ తెలిపారు. ‘ఫ్యూయల్ ఫర్ ఇండియా 2020’ పేరుతో పేస్ బుక్ ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల సదస్సులో ముకేష్ అంబానీ, మార్క్ జూకర్ బర్గ్ మాట్లాడారు.
తండ్రి ధీరూభాయ్ అంబానీ నుంచి అంకుర సంస్థలకు సంబంధించిన పాటలను నేర్చుకున్నానని ఈ సందర్బంగా ముకేష్ అంబానీ తెలిపారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్థాపించి.. దాని విస్తరణకు కృషి చేసి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భాగస్వామి అయ్యారు ధీరుబాయ్ అంబానీ.
అంకుర సంస్థల ఏర్పాటుకు ముకేశ్ అంబానీ సూచనలు:
దైర్యం, నమ్మకం:
అంకుర సంస్థల ఏర్పాటు చేయటం ఎంత సులభమవో.. వాటిని అభివృద్ధి చేయటం అంత కష్టం.
మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించటం కష్టంతో కూడుకున్న పని.. ఒకసారి ఓడిపోతేనే మనకి మనపై నమ్మకం, ధైర్యం ఏర్పడుతుంది. మంచి ఫలితాలు సాధిస్తామని ముకేష్ అంబానీ తెలిపారు.
సానుభూతి:
బిసినెస్ చేయాలి అనుకుంటే.. కస్టమర్ల ఆలోచనలని పసిగట్టాలి. వారు ఏం కోరుకుంటున్నారని తెలుసుకోవటంతో పాటు దానిని వారికి అందించాలి. ముందే వాటిని అంచనా వేయాలని రిలయన్స్ అధినేత సూచించారు.
సంబంధాలు:
ఒక కుటుంబంలాగా రిలయన్స్ ఇండస్ట్రీతో వేల మంది సంబంధం కలిగి ఉన్నారు. పుట్టుక నుంచి మేము ఈ సంబంధాలు కలిగిలేం.. ఈ వ్యాపారంలో ఒకరిపై ఒకరు నమ్మకంతో కలిసికట్టుగా పని చేస్తున్నామని అంబానీ తెలిపారు.
అంబానీ సూచనలతో డిజిటల్ ఇండియా వేదికగా పారిశ్రామికవేత్తలు నమ్మకం పెరిగింది. కోవిడ్ నేపథ్యంలో స్థబ్ధుగా ఉన్న పారిశ్రామిక రంగం తిరిగి పుంజుకుంటుంది. వినియోగ సామర్ధ్యం పెరగడంతో పారిశ్రమలు మళ్ళి ఉత్పత్తులను పెంచుకునే అవకాశం ఉంది.