Ukraine Russia War: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న భీకరమైన పోరు స్టార్ట్ అయి నెల రోజులకు పైగానే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య రెండుసార్లు చర్చలు జరిపారు. కానీ రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇలా ఉంటే ఇప్పుడు మూడవసారి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు దేశాల అధికారులు చర్చలు జరపడానికి సమావేశమవుతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఉక్రెయిన్… ఫస్ట్ టైం రష్యా నగరంపై హెలికాప్టర్లతో గగనతలం నుండి దాడి చేయడం జరిగింది. రష్యాలో నేపద్యం నగరమైన బెల్గొరొడ్…పై ఉక్రెయిన్ కి చెందిన రెండు హెలికాప్టర్ లు… గవర్నర్ చమురు డిపో పై దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు.. గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలాఉంటే ఉక్రెయిన్ సైనిక దాడులలో రష్యా దేశానికి చెందిన సైనికులు దాదాపు 17 వేల మందికి పైగా చనిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఇదే సమయంలో రష్యా దాడిలో 153 మంది పిల్లలు మరణించినట్లు 245 మంది పిల్లలు గాయపడినట్టు లెక్కల బయటపెట్టింది. రష్యా బలగాలు ఉక్రెయిన్ పై 1370 క్షిపణులు ప్రయోగించినట్లు.. దాదాపు ఉక్రెయిన్ దేశానికి చెందిన 15 విమానాలను కుల్చినట్లు స్పష్టం చేసింది. అంతమాత్రమే కాదు రష్యాలో జరిగిన బాంబు దాడుల్లో..148 పిల్లలు మరణించారని తెలిపింది.
ఉక్రెయిన్ లోని డ్నిప్రోపెట్రొవ్స్కి స్థానిక స్థావరంపై రష్యా చేసిన దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.. ఐదుగురు గాయపడ్డారు అని పేర్కొంది. రష్యా దేశానికి చెందిన 625 ట్యాంకులు, 1751 సాయుధ వాహనాలను ధ్వంసం చేసినట్లు తెలిపింది. 143 యుద్ధ విమానాలు, 131 హెలికాప్టర్లు, 85 యూఏవీలను నేలకూల్చినట్లు వెల్లడించింది. వీటికి అదనంగా ఏడు నౌకలు, 54 విమాన, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను నాశనం ఉక్రెయిన్ రక్షణ శాఖ లెక్కలు బయట పెట్టింది. ఇదిలా ఉంటే ఒక పక్క చర్చాలంటూ మరో పక్క ఉక్రెయిన్ దేశం హెలికాప్టర్లతో వైమానిక దాడి చేయడం .. శాంతి వాతావరణానికి కొనసాగించడానికి అనువైన పరిస్థితులు కావానీ.. ఈ విషయం పుతిన్ దృష్టికి తీసుకెళ్లినట్లు… రష్యా దేశం స్పష్టం చేయడం జరిగింది.