నవరాత్రులు వచ్చాయంటే చాలు ప్రజల్లో ఎక్కడ లేని ఉత్సాహం కలుగుతుంది. వినయాక, దుర్గమాత నవరాత్రుల్లో భక్తులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఆ 9 తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో దేవుళ్లను కొలుస్తారు. నవరాత్రులు ముగిశాక దేవిని గంగా తీరానికి కూడా భక్తి శ్రద్ధలతో పంపిస్తారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గమాత నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది.
నిమజ్జనం కోసం విగ్రహాన్ని తీసుకెళ్తున్న రెండు నాటు పడవలు నీటిలో మునిగిపోయాయి. ఈ విషాద ఘటన సోమవారం ముర్షిదాబాద్ జిల్లా బెల్దంగలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 మంది ప్రాణాలను కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రెండు పడవల్లో కలిసి 20 మంది ప్రయాణించినట్లు తెలిపారు. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా విగ్రహం కింద పడటంతో పాటుగా ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు.
పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. అందులో ఇప్పటికే నలుగురి మఈతదేహాలను వెలికితీశారు. అందులో సుఖేందు దే, పికోన్ పాల్, అరిందం బెనర్జీ, సోమనాథ్ బెనర్జీలుగా గుర్తించారు. సాయంత్రం 5:15 గంటలకు ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఐదు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంకా అక్కడ ఎవరైనా మునిగి పోయి ఉండవచ్చనే అనుమానంతో గజ ఈతగాల్ల సహాయంతో చెరువులో గాలింపు చేస్తున్నారు పోలీసులు. అయితే పడవలో 20 మంది ప్రయాణించడం వల్లే ఈ తప్పు జరిగిందని పోలీసులు చెప్తున్నారు.