Food Habits: మధుమేహంతో బాధపడేవారు, బరువు తగ్గాలనుకునేవారు, శారీరకశ్రమ చేయనివారు మీరంతా రాత్రిపూట అన్నం బదులు చపాతీలు తింటున్నారు.. రాత్రి పూట అన్నం బదులు చపాతీ లేదా పుల్కా కంటే మేలైన ఆహారం మరొకటి ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. రాత్రిపూట ఇవి తింటే సులువుగా బరువు తగ్గవచ్చు, మధుమేహానికి చెక్ పెట్టొచ్చు, అలాగే బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు హెల్త్ నిపుణులు.. రాత్రిపూట వీటికి బదులు ఏం తింటే మంచిదో తెలుసుకుందాం..
అన్నం తినడం వలన 500 కేలరీలు వస్తాయి. అలాగే చపాతీ లేదా పుల్కా తినడం ద్వారా 150 నుంచి 250 క్యాలరీలు లభిస్తాయి.. బరువు తగ్గాలి అనుకునేవారికి, డయాబెటిస్ కంట్రోల్ చేయాలనుకునేవారికి ఇది కొంతవరకూ మేలే.. అయినప్పటికీ ఇంతకు మించి మరో మార్గం ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అన్నం, చపాతీ, పుల్కా కంటే కూడా రాత్రిపూట పండ్లను తినడం మంచిదని సూచిస్తున్నారు.. పండ్లలో కేలరీలు ఉండవు. కాబట్టి త్వరగా జీర్ణమవుతాయి.. శరీరానికి కావలసిన పోషకాలు పండ్ల ద్వారా అందుతాయి. త్వరగా జీర్ణం కావటం తో హాయిగా నిద్ర పడుతుంది. శరీరానికి కావలసిన నీటి శాతం వీటి ద్వారా అందుతుంది..
పండ్లను తక్కువ కెలోరీలు ఉంటాయి కాబట్టి బరువు త్వరగా పెరగరు. శరీరంలో నిల్వ ఉన్న అధిక కొవ్వు కరగడానికి ఇవి మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు పండ్లను మాత్రమే కాకుండా డ్రై ఫ్రూట్స్ ను కూడా తీసుకోవాలి. పండ్లను తిన్న తర్వాత గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తింటే ఇవి జీర్ణం అవ్వడానికి కాస్త సమయం పడుతుంది దీని వలన కూడా మా మధుమేహం ఉన్న వారికి బోలెడు లాభాలు కలుగుతాయి.. రాత్రిపూట పండ్లు తినడం ద్వారా తొందరగా జీర్ణం అవుతుంది దీంతో ఆ రోజు త్వరగా నిద్ర పోతారు.. బరువు తగ్గాలనుకునే వారికి పండ్లు వరంగా చెప్పుకోవచ్చు. ఇకనుంచి మీ డిన్నర్ ని కూడా రకరకాల పండ్లతో ప్లాన్ చేసుకోండి.. హెల్దీ గా ఉండండి.