భారత మాజీ క్రికెటర్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ అందరికీ సుపరిచితుడే. ఎడమ చేతివాటం బ్యాటింగ్ తో ఓపెనర్ గా.. సచిన్ టెండూల్కర్ తో దిగి తిరుగులేని స్కోరు సాధిస్తూ.. భారత జట్టుని విజయతీరాలలో ఎన్నోసార్లు చేర్చడం జరిగింది. ఇండియా టీంలో వీరిద్దరి భాగస్వామ్యంకి మంచి ట్రాక్ రికార్డు ఉంది. గంగూలీ .. సచిన్ క్రిజ్ లో ఉన్నారంటే భారత స్కోర్ బోర్డ్ పరిగెత్తాల్సిందే. ఇక భారత జట్టుకి ఎప్పుడైతే గంగూలీ కెప్టెన్ కావటం జరిగిందో.. అంతర్జాతీయ స్థాయిలో చాలా మెరుగైన స్థానాలలో..గంగూలీ నాయకత్వంలో రాణించటం జరిగింది. అంతకుముందు జింబాబ్వే, కెన్యా, బంగ్లాదేశ్ వంటి జట్టులకు మాత్రమే మంచి పోటీ ఇండియా టీం ఇచ్చేది.
కానీ గంగూలీ కెప్టెన్ అయిన తరువాత.. ఇండియా టీం రూపురేఖలు మొత్తం మారిపోయాయి. అప్పట్లో టాప్ టీం లకి పోటీ ఇవ్వటం మాత్రమే కాదు ఏకంగా 2003వ సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్ పోరులో ఇండియా టీం ఫైనల్ దాక చేర్చడంలో గంగూలీ ఎంతగానో రాణించాడు. కానీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం జరిగింది. అనంతరం క్రికెట్ జట్టుకి రిటైర్మెంట్ ఇచ్చిన గంగూలీ .. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా రాణిస్తున్నారు.
అయితే జూలై 8న గంగూలీ పుట్టినరోజు కావడంతో 50వ బర్తడే వేడుకలు లండన్ వీధులలో కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి జరుపుకోవడం జరిగింది. ఈ క్రమంలో డాన్సులు వేయడంతోపాటు కేక్ కట్ చేసి గంగూలీ హుషారుగా చిందులు వేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.