Long Life: కొంతమంది 100 ఏళ్లు బ్రతుకుతారు.. మరికొంతమంది మధ్య వయసులోనే చనిపోతుంటారు.. అటువంటి వారు కొంతమంది నూరేళ్లు ఎలా బ్రతికారు అని అనుకుంటారు.. ఈ అంశంపై చేసిన అధ్యయనాలలో నాలుగు ఆరోగ్యకరమైన అలవాట్లతో ఇది సాధ్యమైందని తేలింది.. మరి ఆ నాలుగు అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!
Long Life: ఈ ఫోర్ పిల్లర్స్ ఏర్పరుచుకుంటే..
యూకేలో ఎక్స్ప్రెస్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం, ఈ నాలుగు అలవాట్లను మీరు చేసుకుంటే మీ జీవితకాలాన్ని అదనంగా మరో 14 ఏళ్లపాటు పెంచుకోవచ్చని చెబుతున్నారు అధ్యయనకర్తలు.. ఈ అధ్యయనం కోసం 45 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న 20,244 మంది పై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని కనుగొన్నారు.. ఇందుకోసం ఎటువంటి గుండె జబ్బులు, క్యాన్సర్ లేనివారిని ఈ ఈ అధ్యయనం కోసం ఎంపిక చేసుకున్నారు. వీరిపై అధ్యయనం చేసిన తరువాత జీవనశైలికి, మరణాలకు మద్య ఉన్న వ్యత్యాసాన్ని అంచనా వేశారు. ఈ అధ్యయనంలో నాలుగు ఆరోగ్యకరమైన అలవాట్లు జీవితకాలం పెంచేందుకు ముఖ్య పాత్ర పోషించినట్లు వారు గుర్తించారు.
వాటిలో మొదటిది ప్రతిరోజు కనీసం గంట పాటైనా ఏదో ఒక వ్యాయామం చేయటం. రోజుకి ఒక గంట పాటు నడవాలి. యోగా, మెడిటేషన్ ఇలా మీకు నచ్చినవి ఏదో ఒకటి చేయాలి. లేదంటే ఒక గంట సేపు ప్రకృతిలో కాలం గడపాలి. లేదంటే వారంలో కనీసం 150 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. అలా కాకుండా ఎక్కువ సేపు కూర్చో కోకుండా ఉండేలా చూసుకోవాలి. శరీరాన్ని చురుకుగా ఉండేలా చేసుకోవాలి శరీరానికి కాస్తైనా శారీరక శ్రమ చేసేలా పనులు చేయాలి. అలా కాకుండా ఎక్కువ సేపు తిని కూర్చోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారి లో మరణాల రేటు అధికంగా ఉంటుంది అందువలన ఆల్కహాల్ తాగడం ఇప్పటి నుంచి మానేయడం మంచిది. ఒకేసారిగా మానేయడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొద్ది కొద్దిగా పరిమాణం తగ్గించుకుంటూ మానేస్తే తర్వాత దాని జోలికి వెళ్లకుండా ఉంటారు. దీనితోపాటు ధూమపానం అలవాటు ఉంటే అది కూడా మనేయటం ఉత్తమం. ధూమపానం వలన మీ జీవిత కాలాన్ని మీరే తగ్గించుకున్న వారవుతారు. ధూమపానం వలన అనేక రకాల శ్వాసకోస సమస్యలు ఉత్పన్నమై అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. మీ ఆయుష్యును తగ్గిస్తుంది.
కొంతమంది తమ ఆహారపు అలవాట్లను ఎంత చెప్పినా మార్చుకోరు. వారికి నచ్చిన విధంగానే కూరలు, పండ్లు తింటూ ఉంటారు. ముఖ్యంగా ఏ సీజన్లో లభించే పండ్లు ఆ సీజన్లోనే తినాలి. అవి ఆ సమయంలో వచ్చే వాతావరణ మార్పులకు అనుగుణంగా మన శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. ప్రతిరోజు రెండు రకాల పండ్లను తీసుకుంటూ ఉండాలి. రెండు పండ్లను కూడా కలిపి తినకూడదు. వాటిని వేరు వేరుగా ఒక గంట సమయం తర్వాత తీసుకుంటే చాలా మంచిది. పండ్ల రసాల కంటే కూడా పండ్లను నేరుగా తినడమే ఉత్తమం. అలాగే రోజు ఒక రకమైన కూరగాయలతో చేసిన కూరలు కాకుండా రెండు మూడు రకాల కూరగాయలతో చేసిన వంటకాలు తీసుకుంటే వాటిలో ఉన్న పోషక విలువలు మన శరీరానికి అందిస్తాయి. వీటితో త్వరగా అనారోగ్య సమస్యల బారిన పడము.