Dhoni Gambhir: క్రికెట్ ప్రపంచంలో ధోని, గౌతమ్ గంభీర్ బాగా పాపులర్ అని అందరికీ తెలుసు. ఒకప్పుడు భారత జట్టుకి కెప్టెన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన ఇద్దరూ… రిటైర్ అవ్వకముందు నువ్వా నేనా అన్నట్టు గా వ్యవహరించేవారు. ఇద్దరికి అస్సలు పడేది కాదు. రిటైర్ అయిపోయి నాక కూడా గంభీర్… ధోనిపై అనేకమార్లు కాంట్రవర్సి కామెంట్లు చేయడం జరిగింది. 2011 ప్రపంచ కప్ విజయం సాధించటంలో లాస్ట్ లో ధోని సిక్స్ కొట్టడంతో అతని పేరు బాగా హైలెట్ అయ్యింది. కానీ వాస్తవానికి నేను, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్ బాగా ఆడటం వల్ల ప్రపంచ కప్ గెలవడం జరిగింది అంటూ గంబీర్ అనేకమార్లు… ధోని పై తనకున్న అక్కసు వెళ్లగక్కడం జరిగింది. ధోని కొట్టిన ఆ ఒక్క సిక్స్ వల్ల విజయం సాధించలేదు. ఇంకా మాతో పాటు కోహ్లీ, సెహ్వాగ్ లాంటి వాళ్ళు… బాగా ఆడటం వల్ల గెలవడం జరిగింది అని బహిరంగంగానే గంబీర్ కామెంట్ చేయడం జరిగింది.
అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్లో సెంచరీ మిస్ అవ్వడానికి మహియే కారణమని గంబీర్ అనేకమార్లు తెలియజేయడం తెలిసిందే. అటువంటి గౌతం గంభీర్ చాలా కాలం తర్వాత ధోనీపై పాజిటివ్ కామెంట్లు చేసి అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. నాకు కు తో నీటి మధ్య గొడవలు ఉన్నాయి అనేది కేవలం పుకార్లు మాత్రమే. తోటి ప్లేయర్ గా మనిషిగా ధోని అంటే నాకు అత్యంత గౌరవం. భవిష్యత్తులో ధోని కి ఎటువంటి అవసరం వచ్చినా నేను ముందు ఉంటా.
పైగా ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో వైస్ కెప్టెన్ గా ఎక్కువ కాలం ఉన్నది నేనే అంటూ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ప్రత్యర్థుల తలబడతాం. ధోని టీమిండియా కోసం అనేక త్యాగాలు చేశాడు. టీమిండియా కోసం తొలి ఫార్మెట్ బ్యాటింగ్ లైనప్ లో రావాల్సిన దోని చివరిలో వచ్చేవాళ్ళు. దీంతో అనేక రికార్డులు కోల్పోయాడు. ప్రారంభంలోనే ధోని బ్యాటింగ్ లైనప్ లో వచ్చి ఉంటే అనేక రికార్డులు సృష్టించే వాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్ జట్టుకి మెంటార్ గా వ్యవహరిస్తున్న గంభీర్… ఒక్కసారిగా ధోనిపై పాజిటివ్ కామెంట్లు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.