Chiranjeevi: దసరా వేడుకలలో భాగంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయన కుమార్తె బీజేపీ నేత విజయలక్ష్మి గురువారం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో “అలయ్ బలయ్” కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి దత్తాత్రేయ ఆయన కుమార్తె ఆహ్వానించడం జరిగింది. దీంతో ఈ “అలయ్ బలయ్” కార్యక్రమానికి చిరంజీవి హాజరు కావడం జరిగింది. ఇదే కార్యక్రమానికి ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఒకానొక సమయంలో గరికపాటి నరసింహారావు చిరంజీవిపై అసహనం వ్యక్తం చేశారు.
సరిగ్గా గరికపాటి ప్రసంగిస్తున్న సమయంలో చిరంజీవి అక్కడికి రావడం జరిగింది. చిరంజీవి రాకతో ఒక్కసారిగా సభా ప్రాంగణం అంతా అరుపులు కేకలతో దద్దరిల్లింది. అదే సమయంలో కొంతమంది చిరంజీవితో సెల్ఫీలు దిగటానికి ఎగబడ్డారు. దీంతో గరికపాటి నరసింహారావు మైక్ లోనే చిరంజీవి పట్ల అసహనం వ్యక్తం చేశారు. చిరంజీవి గారు మీరు ఫోటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్ళిపోతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో చిరంజీవి వెంటనే తనకు కేటాయించిన సీటులో కూర్చోవడం జరిగింది.
ఆ తర్వాత గరికపాటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఒక్కసారిగా గరికపాటి చిరంజీవి పై అందరూ ఉండగానే మైకులో అసహనంగా కామెంట్లు చేయడంతో ఈ వార్త ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. ప్రతి ఏడాది దసరా తర్వాత ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. గత ఏడాది మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా “మా” అధ్యక్షుడు విష్ణు ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది.