Gold Seized : దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున బంగారం తరలిస్తూ పట్టుబడుతున్నారు.. విదేశాల నుంచి వస్తున్న వారు అక్రమంగా.. రహస్యంగా బంగారాన్ని తరలిస్తూ కస్టమ్ అధికారులకు చిక్కుతున్నారు.. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పెద్ద మొత్తంలో బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు..
కేరళ లోని కొచ్చి నుంచి హైదరాబాద్ వస్తున్న ఒక ప్రయాణికుడు బంగారాన్ని తీసుకువస్తున్నాడన్న పక్కా సమాచారం అందింది.. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు.. ఈ తనిఖీల్లో ఓ ప్రయాణికుడి నుంచి రూ. 60 లక్షల విలువైన 1.2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్ అధికారులు తెలిపారు. అయితే ఈ బంగారం దుబాయ్ నుంచి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.. విదేశాల నుంచి తీసుకు వచ్చిన బంగారం ఎవరికీ ఇచ్చేందుకు తెచ్చారు.. ఎలా తీసుకు వచ్చారు.. అనే విషయం పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?