కేరళ రాష్ట్రంలో ఒక్క సారిగా బంగారం స్మగ్లింగ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి ఐటీ సెక్రెటరీ శివశంకర్ ను అతని పదవి నుంచి తొలగించడం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది. ఈ బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎం కార్యాలయం ప్రమేయం ఉందన్న ఆరోపణలు మొదటనే వచ్చాయి.
గత వారం కేరళలో వెలుగుచూసిన ఈ బంగారం స్మగ్లింగ్ లో ఐటీ శాఖ ఉద్యోగి పాత్ర ఉందని చాలా ఖచ్చితమైన ఆరోపణలు చేయడంతో తర్వాతి రోజే శివశంకర్ పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్సైన్మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఈ దందా వెలుగుచూసింది.
కేరళలో యూఏఈ కాన్సులేట్ లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని సోమవారం కాన్సులేట్ అధికారుకు అనుమానాస్పదంగా కనిపించడంతో అరెస్టు చేశారు. దాంతో 15 కోట్ల రూపాయల విలువైన బంగారం స్మగ్లింగ్ జరిగినట్లు వారి విచారణలో తెలిసింది. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం ఇప్పుడు తిరిగి తిరిగి కేరళ సీఎం కూడా తాకింది. దీని వెనుక రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఉన్నారని కాంగ్రెస్ బిజెపి నేతలు ఆరోపించారు.
సీఎం కార్యాలయం కేరళలో నేర కార్యకలాపాలు అడ్డాగా మారిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇక ఇందుకు సంబంధించిన యాక్షన్ సీఎం ఇప్పటికే తీసేసుకోగా ప్రతిపక్షాల విమర్శలకు స్పందిస్తారా లేదా అతని మెడకు చుట్టుకున్న ఈ వ్యవహారం గూర్చి తనకేం సంబంధం లేదని ఖచ్చితమైన ఆధారాలతో బయట పెడతారా లేదా అన్నది వేచిచూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?