బంగారం.. ఈ పేరు వినగానే ఆడవాళ్లు అమాంతం అలా ఊహల్లో తేలిపోతారు కదా.. అవును బంగారం కేవలం వేసుకునే ఆభరణం మాత్రమే కాదు. అత్యవసర సమయంలో ఆదుకునే బంధువు కూడా. అందుకే వారు బంగారానికి ఇచ్చే ప్రధానం మరే దానికి ఇవ్వరు. అలాగే బంగారం ఎప్పటికి విలువ తగ్గని ఆభరణం కూడా. అందుకే దాన్ని కొనడానికైనా, అందులో ఇన్వెస్ట్ చేయాడానికైనా అందరూ రెడీగా ఉంటారు. అయితే మీరు కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా..?
అయితే మీకోసం భారత్ పే కొత్త సర్వీసులను తీసుకొచ్చింది. డిజిటల్ గోల్డ్ సర్వీసులను ప్రారంభించింది. ఒక్కరూపాయి నుంచే ఇందులో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పిస్తోంది. సేఫ్ గోల్డ్ భాగస్వామ్యంతో వారి మర్చంట్లకు ఈ డిజిటల్ సదుపాయం కల్పిస్తోంది. భారత్ పే ద్వారా కస్టమర్లు బంగారాన్ని ఏ టైంటో అయినా కొనొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. ఎక్కడి నుంచైనా ఈ బంగారాన్ని కొనొచ్చు.
అలాగే కేవలం ఒక్కరూపాయితో కూడా బంగారాన్ని కొనొచ్చని భారత్ పే చెబుతోంది. కస్టమర్లు పేమెంట్లను భారత్ పే బ్యాలెన్స్ లేక యూపీఐ తో చెల్లించొచ్చు అని చెబుతోంది. అదే కాకుండా రాబోయే రోజుల్లో క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా బంగారాన్ని కొనే సదుపాయాన్ని తీసుకోస్తమని భారత్ పే చెబుతోంది. ఈ దీపావళి పండగ రోజు వరకు 6 కేజీల బంగారాన్ని అమ్మడమే లక్ష్యంగా ప్లాన్ చేసుకున్నట్లు భారత్ పే చెబుతోంది.
భారత్ పే మర్చంట్లు గ్లోబల్ మార్కెట్లతో కనెక్ట్ అయిపోయి బంగారం ధరలను చెక్ చేసుకోవచ్చని భారత్ పే చెబుతోంది. మర్చంట్లు బంగారాన్ని భారత్ పే ద్వారా కొంటే.. దానిపై జీఎస్ టీ ఇన్ పుట్ ను క్రెడిట్ చేసుకోవచ్చని చెబుతోంది. బంగారాన్ని కొన్నవారు.. ఫిజికల్ బంగారం కావాలనుకుంటే కూడా డెలివరీ చేస్తామని చేబుతోంది. లేకపోతే మర్చట్లు కొన్న బంగారం సేఫ్ గోల్డ్ లాకర్లలో భద్రంగా ఉంటుందని తెలిపింది. ఎక్కువ మంది డిజిటల్ గోల్డ్ సర్వీసులు కావాలని అంటున్నందుకు ఈ సర్వీసులను తెచ్చినట్లు భారత్ పే చెబుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు తీసుకురానున్నట్లు భారత్ పే ప్రెసిడెంట్ సుహైల్ సమీర్ పేర్కొన్నారు.